ఆకట్టుకున్న యక్షగాన ప్రదర్శన
త్యాగరాజ స్వామి దాదాపు రెండున్నర శతాబ్దాల నాడు కొన్ని ప్రదర్శనలిచ్చిన అపురూప యక్షగానం శని వారం రాత్రి ప్రదర్శితమైంది. ఈశ్వర వరప్రసాద పరిషత్తు ఆధ్వర్యంలో స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నాట్యాచార్య కాజ వెంకట సుబ్రహ్మణ్యం తన శిష్య బృందంతో కలిసి ప్రదర్శించారు. త్యాగయ్యగా కాజ వెంకట సుబ్ర హ్మణ్యం, విష్ణుమూర్తి పాత్రలో కొల్లి అక్షయ, లక్ష్మీదేవిగా దేవేంద్ర గాయత్రి, ప్రహ్లాద పాత్రలో బిక్కి తోషిత, నారదుడుగా కొర్లకుంట వైష్ణవి, సముద్రుడు పాత్రలో నాట్యా చార్య బాలు, గరుత్మంతుడుగా దొంతి రెడ్డి లక్ష్మి గోపిక, ద్వారపాలక పాత్రలో పూల భరణి పాల్గొన్నారు. రవికృష్ణ, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య తది తరులు తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, చంద్రమోహన్, సత్యనారాయణరాజు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి