అలరించిన సినీ సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతి స్వరసుధ రజతోత్సవ పంచమ భక్తి, సినీ, సంగీత విభావరి అధ్యక్షురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి గౌరవ అతిధులుగా ఛైర్పర్సన్, మహతీ స్వరసుధ వెనిగళ్ల విజయలక్ష్మి, సహస్ర జూవెలర్స్ దోగిపర్తి శ్రీహర్ష హంస జూవెలర్స్ దోగిపర్తి శ్రీచక్ర, ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, బండ్లమూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అలనాటి సినీగీతాలను పత్రినిర్మల, రసూల్ బాబు, సురభి శ్రావణి, రాజ్యలక్ష్మి, మనస్విని, హేమమాలిని, ప్రద్యుమ్న, వలి, వీరరాఘవ, కృష్ణ ప్రసాద్ అలనాటి సినీ గీతాలను మధురంగా ఆలపించి అభిమానులను అలరించారు. వీరికి కీబోర్డ్పైకే. రవిబాబు, తబలా పై ఎస్.వెంకట్, పాడ్స్ టి. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. పత్రినిర్మల, మదన్మోహన్రావు కళాకారులను, అతిధులను ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి