భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సంగీత రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి