సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
ఆకట్టుకున్న సంగీత రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి