ఘనంగా అన్నమాచార్య జయంత్యుత్సవం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవం శనివారం రాత్రి జరిగింది. తొలుత కార్యక్రమాలను ఛాతీ సంబంధ వ్యాధుల చికిత్స నిపుణుడు డాక్టర్ శ్రీకంటి రఘు, మైధిలి దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, భూసురపల్లి వెంకటేశ్వర్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబును సత్కరించారు. మల్లాది సోదరులు శ్రీరామప్రసాద్, రవికుమార్ల శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ జరిగింది. సంస్థ అధ్యక్షు రాలు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి కళాకారులు, అతిథులను సత్కరించారు.
ఆకట్టుకున్న సంగీత రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి