విశేషంగా ఆకట్టుకున్నహనుమత్ వైభవ ప్రవచనం
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుజాత దంపతులచే ఆకుపూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరకాండలోని హనుమత్ వైభవంపై నారాయణమూర్తి ప్రసంగించారు. సుందరకాండలోని ప్రతి అంశాన్నీ వాల్మీకి మహర్షి సుందరంగా వర్ణించారని చెప్పారు.స్వామికీ విశేష అభిషేకాలు, నాగవల్లి దళార్చన, అలంకరణతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య,ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి