ఆకట్టుకున్న నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాధామాధవ కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 319వ నెలనెలా వెన్నెల సందర్భంగా ఆదివారం జరిగిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత పారిశ్రామికవేత్త మిట్టపల్లి రమేష్బాబు తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు నాట్యగు రువులు బెళ్ళగుబ్బల అనితారావ్, బి.శారద, చింత వెంకట శివరామకృష్ణకుమార్, టి.సాయిమాధవి, చింతల భ్రమరాంబిక, అనంతుల విజయకుమారిలను నాట్యసారధి అవార్డుతో వారి శిష్యులకు నాట్యరంజని అవార్డుతో ఘనంగా సత్కరించారు.
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.