ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మికత శాంతికి సోపానం - 02.03.2025

ఆధ్యాత్మికత శాంతికి సోపానం  సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు శాంతి వర్ధిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  గళ్ల మాధవి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాబిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం శేష వాహన సేవ ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తిరుమలలో జరిగినట్లుగానే గుంటూరులో ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భీమవరానికి చెందిన త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భాగవత విశేషాలను వివరించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాస నాథ్ కుంభాబిషేక విశిష్టతను వివరించారు. వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవస్థాపకుడు బొల్లే పల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. లంకా సూర్యనారాయణ, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదే...

నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం - 27.02.2025

నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్‌లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్‌బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

శివలింగానిక అభిషేకాలు, నృత్య జాగరణ - 26.02.2025

స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలోని యాగశాలలో లక్ష్మీగణపతి, రుద్రా, చండి హోమాలు, మహా పూర్ణాహుతితో ముగిశాయి. బొల్లేపల్లి సత్యనారా యణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో ధార్మిక ప్రాంగణంలోని శివలింగానికి లంకా విజయబాబు, బొర్రా ఉమామహేశ్వరరావు, యడ్లపాటి అశోక్‌కుమార్, నూతలపాటి తిరుపతయ్య అభిషేకార్చన నిర్వహించారు. బృందావన గార్డెన్స్  శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో మహాశివ రాత్రి సందర్భంగా 12 గంటల నిర్విరామ నృత్యనీరాజన కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు శివపాద మంజీర నాదం-2 పేరున శివరాత్రి నృత్య జాగ రణ నిర్వహించారు. కార్యక్రమాన్ని డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్య నారాయణ, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో 108 మంది పాల్గొన్నారు. నాట్యచార్య డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం నృత్య దర్శకత్వంలో కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాన్ని వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్లూరి ధరణి, పూజితశ్రీ, మహిత పర్యవేక్షించారు.

మార్చి 1 నుండి అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం

మార్చి 1 నుండి అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం స్థానిక బృందావన గార్డెన్స్  శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అష్టబంధన మహా సంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు మార్చి 01 నుండి 07 వరకు నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుండి 14 వరకు జరుగుతాయన్నారు. కుంభాభిషేకం మహోత్సవాలలో  ప్రతిరోజు నిత్యపూజలు, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు జరిగే సంప్రదాయ సభలో పీఠాధిపతులు, మఠాధిపతులు, మాతాజీలు, పురప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొంటారన్నారు. కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా మార్చి 1న విశ్వక్సేనారాధన, పుణ్యావచనం, మేదిని పూజ  2న శేషవాహన సేవ, 3న గజవాహన సేవ, 4న హనుమత్ వాహన సేవ, 5న గరుడవాహన సేవ, సువాసిని పూజ, చండీహోమం, అష్టబంధ సమర్పణ 6న మహాశాంతి అభిషేకం, శాంతిహోమం, పూర్ణాహుతి, 7న శ్రీవారి కల్యాణోత్సవం కుంభాభిషేకం, మహపూర్ణాహుతి, అన్...

శివరాత్రి చండీహోమం ప్రారంభం - 24.02.2025

శివరాత్రి చండీహోమం ప్రారంభం  బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం చండీహోమాన్ని ప్రారంభించారు. పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల నిర్వహణలో గణపతి, శివలింగం, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చ నలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి హోమద్రవ్యాలతో హోమ పూర్ణాహుతి నిర్వహించారు. అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త గుదిమెళ్ల శ్రీకూ ర్మనాథస్వామి మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజ యబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటు కూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. 

లంకా సేవలకు గుర్తింపు - 23.02.2025

లంకా సేవలకు గుర్తింపు గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా  సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.

అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాల అందజేత - 23.02.2025

అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాల అందజేత గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న లంకా సూర్యనారాయణకు రెండు సినిమా పుస్తకాలను సెంట్రల్ ఎక్సైజ్ పింఛనర్ల సంఘం బహూకరించింది. బృందావన్ గార్డెన్స్‌లోని  అన్నమయ్య గ్రంథాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ పింఛనర్ల సంఘ నేత గుమ్మడి సీతారామయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్, కథానాయిక ఎల్.విజయలక్ష్మిలపై కొత్తగా ప్రచురించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ అరుదైన ఛాయాచిత్రాలు, నేటితరానికి తెలియని ఎల్. విజయలక్ష్మి సినీ జీవిత గాథ ఈ పుస్త కాల ప్రత్యేకత అన్నారు. పుస్తక రూపకర్తలు చిన్ని శ్రీను (రాజమండ్రి), కంపల్లె రవిచం ద్రన్ (తిరుపతి) కోరిక మేరకు పుస్తక తొలి ప్రతులను అన్నమయ్య గ్రంథాలయానికి అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెంట్రల్ ఎక్సైజ్ పించనర్ల సంఘ నాయకులు టి. వివేకానంద, పీవీ సత్యనారా యణ, పి. కోటేశ్వరరావు, గ్రంథపాలకురాలు సుహాసిని తదితరులు పాల్గొన్నారు. 

అలరించిన సినీ సౌరభాలు - మహతి స్వరసుధ - 23.02.2025

అలరించిన సినీ  సౌరభాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య   కళావేదికపై మహతి స్వర సుధ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ద్వితీయ కార్యక్రమంలో జరిగిన సినీ సౌరభాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత చార్టెడ్ అకౌంటెంట్ జి. సాయిబాబు, సాహితీ ప్రియులు పచ్చి పులుసు  సూర్యనారాయణ, కే.శ్రీధర్ బాబు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు, మన్నవ సుబ్బారావు,ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని గాయకులు పత్రి నిర్మల,  జి హరికృష్ణ,  డాక్టర్ ఏ వీర రాఘవ, ఎస్ కే రసూల్ బాబు, బి కృష్ణ ప్రసాద్, కీబోర్డు కే రవి, ఎస్ కే వలీ, సిహెచ్ రాజ్యలక్ష్మి, ఎం ఎం ప్రసన్నలక్ష్మి, ఎండి జరీనా, జి సువర్ణ విద్య, వి. రాజేశ్వరి దేవి, సిహెచ్ సుధా శ్రీనివాస్,బి ప్రద్యుమ్న  సత్యోద్భవి లు తమ గాత్రధారణ లొ అలనాటి మేటి చిత్రాల్లోని పలు  మధుర గీతాలను  శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై ఎస్ వెంకట్, ప్యాడ్స్ పై  టి.ఈశ్వర్  వాయిద్య సహకార అందించారు. కె.మదన్ మోహన్ రావు కార్యక్రమాన...

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు 22.02.2025

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా -  శోభనాద్రీశ్వరరావు ' రైతు జన నేతగా , ప్రజానాయకుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ధర్మబద్ధ రాజకీయ నాయకుడు ఎలా. ఉండాలో అలా ఉన్నాను ' అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వధర్మ సేవా సంస్థ శనివారం రాత్రి ఆయనకు ధర్మజ్యోతి పురస్కారం ప్రదానం చేసి సత్కరించింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు పరంగా లాండ్ సీలింగ్ యాక్ట్ తదితర సందర్భాల్లో వచ్చిన సమస్యలను దిల్లీ నాయకులతో చర్చించి పరిష్కరించినవి అనేకం ఉన్నాయన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఇంటికి వచ్చిన వారందరికీ తన భార్య ఆతిథ్య మిచ్చి తనకు మంచి పేరు తెచ్చిపెట్టినట్లు వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రాన్రాను యువత వ్యవసాయానికి దూరమవుతున్నారని , ఈ పరిస్థితి మారాలన్నారు. రైతు కుంటుంబం నుంచి ఢిల్లీ వరకు వెళ్లి పదవులు చేప ట్టిన వారు కూడా రైతుకు మేలు చేసేలా చట్టాలు తేలేకపోవడం విచారకరమన్నారు. గౌతు లచ్చన్న తదితర నాయకుల అడుగు జాడల్లో నడిచిన వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు మాత్రం శక్తికొద్దీ పోరాడుతున...

తెలుగు భాష చమత్కారమయం - 21.02.2025

తెలుగు భాష చమత్కారమయం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య సౌజన్యంతో రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసో సియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ మైలవ రపు లలితకుమారి అధ్యక్షత వహించారు. తెలుగుకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అవధాన కళా సౌరభం గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, చాటుక విత్వ చమత్కారాల గురించి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. డాక్టర్ వేమూరి సత్యవతి తెలుగు భాషలో వారసత్వంగా తెలుగు జాతికి అందించిన పద సంపద, నుడికారాల గురించి వివరించారు.

భగవద్గీత ప్రవచనములు - సువీరానందస్వామి - 17.02.2025

భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై వఝా రంగారావు, శేషారత్నం దంపతుల సౌజన్యంతో సోమవారం శ్రీమద్భగవద్గీత ద్వాదశ అధ్యాయం భక్తియోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య,  సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అనన్యభక్తితో నిరంతము నిన్నే ధ్యానించుచూ, పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించేవారు, భక్తి భావముతో సేవించేవారు ఉన్నారన్నారు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులు ఎవరనగా శ్రీకృష్ణ పరమాత్ముడు నాయందు ఏకాగ్రచితులై, నిరంతరరము నా భజన ధ్యానములందు నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో ననను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులని తెలియజేశారన్నారు.

ముగిసిన భాగవత ప్రవచనాలు - 16.02.2025

ముగిసిన భాగవత ప్రవచనాలు స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త పీ.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్ జయంతి సందర్భంగా భాగవత రస వైభవం పేరున భాగవత సప్తాహం ఆదివారం రాత్రి ముగిసింది. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ముగింపు ప్రవచనంలో రుక్మిణీ కల్యాణ నేపధ్యంలోని సాహిత్య, తాత్వికాంశాలను వివరించారు. కృష్ణునికి పంపే సందేశం ప్రణయ సందేశం వలె కనిపిస్తుందన్నారు. అనంతరం మంత్రాశ్రమ పీఠాధిపతి నరసింహానంద భారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వర రావు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాప కుడు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీస మాఖ్య కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, సాహితీవేత్త నారాయణం శేషుబాబు, పి. రవికిషోర్, పి.హైమానంద తదితరులు పాల్గొని మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు.