భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.