ఆధ్యాత్మికత శాంతికి సోపానం సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు శాంతి వర్ధిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాబిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం శేష వాహన సేవ ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తిరుమలలో జరిగినట్లుగానే గుంటూరులో ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భీమవరానికి చెందిన త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భాగవత విశేషాలను వివరించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాస నాథ్ కుంభాబిషేక విశిష్టతను వివరించారు. వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవస్థాపకుడు బొల్లే పల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. లంకా సూర్యనారాయణ, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదే...
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.