అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...
ఆకట్టుకున్న ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ , గుంటూరు వారి సౌజన్యంతో శ్రీ షిరిడిసాయి తోలుబొమ్మలాట బృందం , నరసరావుపేట వారిచే తెలుగువారి ప్రాచీన కళారూపం ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. దుర్గారావు, సత్యనారాయణ, కుమారి, కోటేశ్వరి, చిన్న, బ్రహ్మం, వెంకట దాసు, గణేష్, కార్తికేయ, కమల్ బృందం పాండవుల అజ్ఞాతవాసం , బృహన్నల నాట్యగురుత్వం , కౌరవుల కుట్ర , ఉత్తరకుమారుని ప్రజ్ఞలు , ఉత్తర గోగ్రహణము చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం ఘట్టాలను పద్యాలు , గేయాలు , వచనంతో అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొన్నారు. గుళ్ళపల్లి రాఘవరావు కళాకారులను ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.