ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం - 07.02.2026

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...

ఆకట్టుకున్న ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట - 16.05.2025

ఆకట్టుకున్న ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ , గుంటూరు వారి సౌజన్యంతో శ్రీ షిరిడిసాయి తోలుబొమ్మలాట బృందం , నరసరావుపేట వారిచే తెలుగువారి ప్రాచీన కళారూపం ఉత్తర గోగ్రహణము తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. దుర్గారావు, సత్యనారాయణ, కుమారి, కోటేశ్వరి, చిన్న, బ్రహ్మం, వెంకట దాసు, గణేష్, కార్తికేయ, కమల్ బృందం పాండవుల అజ్ఞాతవాసం , బృహన్నల నాట్యగురుత్వం , కౌరవుల కుట్ర , ఉత్తరకుమారుని ప్రజ్ఞలు , ఉత్తర గోగ్రహణము చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం ఘట్టాలను పద్యాలు , గేయాలు , వచనంతో అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొన్నారు. గుళ్ళపల్లి రాఘవరావు కళాకారులను ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

నాటక రంగానికి రవికుమార్ సేవలు ఎనలేనివి - 15.05.2025

నాటక రంగానికి రవికుమార్ సేవలు ఎనలేనివి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై రంగస్థల నటుడు, రచయిత డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ కు గురువారం రాత్రి పురస్కార ప్రదానం జరి గింది. సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావా హిని ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు జయంతి సంద ర్భంగా ఈ పురస్కారం అందించారు. సభకు యువకళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా రామరాజు ఫౌండేషన్ ప్రతినిధి రామరాజు శ్రీనివాసరావు, ఆలయ పాల కమండలి సహ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శారద కళా సమితి అధ్యక్షుడు దోగిపర్తి శంకరరావు, ఆప్కాబ్ బ్రాంచి మేనేజర్ పి. లక్ష్మీ సువర్చల, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్యలు పాల్గొని.. రవికుమార్ నాటక రంగానికి చేసిన కృషిని వివరించారు. అనంతరం డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ బృందం సత్యహరిశ్చంద్రీయం నాట కంలోని వారణాసి ఘట్టం ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కార్యక్రమాలను లంక లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు. భాగి శివశంకరశాస్త్రి, ఎంఏ హమీద్, జి.మల్లికార్జున...

మాతాపితల సేవలో దాగివున్న మాధవ సేవ - 14.05.2025

మాతాపితల సేవలో దాగివున్న మాధవ సేవ తల్లిదండ్రుల సేవలో ఉందని మాధవసేవ వారిని ఉన్నతులుగా భావించి భక్తి శ్రద్ధలతో సేవించాలని సుందర చైతన్యానంద స్వామి శిష్యులు, ఆధ్యాత్మిక ప్రవచకులు కె.వి కోటేశ్వరావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంక టేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ఆదిశంకరాచార్యుల విరజిత మాతృ పంచకం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవీ కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ జీవితంలో తల్లికి మించింది ఏదీ లేదన్నారు. పుడమి తల్లికంటే జన్మనిచ్చిన తల్లేగొప్పది అన్నారు. వర్షించేనింగికన్నావాత్సల్యాన్ని కురిపించే తండ్రి గొప్ప వాడన్నారు. తన ఆయుష్షును కూడా పోసుకుని సంతోషంగా బతకమనేది తల్లి అందుకే మన వేదాలలో తల్లికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందో తెలుపుతూ, ఆతల్లిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకోవాలన్నారు. ఇందుకు నిదర్శనం శ్రీ ఆదిశంకరుల వారి చరిత్రే అన్నారు. శ్రీ రాముడు మాతాపితల పట్ల యెంత భక్తి కలిగి ఉన్నాడనేది రామాయణం తెలియజే స్త...

మాతృభక్తి మన సంస్కారం - 13,14. 05.2025

మాతృభక్తి మన సంస్కారం - 13,14.05.2025 తల్లికే మొదటి నమస్కారం మన సంప్రదాయమని సుందర సత్సంగ్ సభ్యుడు కేవీ కోటే శ్వరరావు తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ఆదిశంకరాచార్యస్వామి జయంతి సందర్భంగా మంగళవారం 'మాతృదేవోభవ' అనే అంశంపై కే.వీ. కోటేశ్వరరావు ప్రసంగించారు. తల్లిని గౌరవించడం మన సంస్కారమని వేదాలు  పేర్కొన్నాయన్నారు. ఆ భగవంతుడి ప్రతిరూపమే తల్లి అని, ప్రాణం ఉన్నంత కాలం తల్లిదండ్రులు సేవలు చేసినవారికి సౌభాగ్యం కలుగుతుందన్నారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 12.05.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు - 12.05.2025

వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్‌కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న భక్తి రంజని - 12.05.2025

ఆకట్టుకున్న  భక్తి రంజని  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ   ప్రాంగణం అన్నమయ్య కళావేదిక పై స్వరరాగ సుధ ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి సందర్బంగా సోమవారం  జరిగిన భక్తి సంగీత విభావరి  ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి  ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  గాయని, గాయకులు కేవీ సాయిబాబా శర్మ, నాగమల్లేశ్వరరావు, కృష్ణకుమారి లు తమ గాత్రధారణలో  అన్నమాచార్య విరచిత  పలుభక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపించారు.కీబోర్డుపై ఎం రామకృష్ణ శర్మ,  తబలాపై షణ్ముఖ శర్మ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు.