ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన భక్తి సంగీత విభావరి - 07.06.2025

అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్ , ఆకాశవాణి , దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు , శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న,  తిరుపతి వేంకట రమణ , హరే వేంకట రమణ బ్రోవరా , సప్తగిరులపై వెలసి వేంకటేశ , నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు , మాధవా కేశ మధుసూదన , ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి , నానాటి బ్రతుకు నాటకము , రంగ రంగ రంగపతి రంగనాధ్ , చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్‌పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదే...

నాటక రంగానికి రవికుమార్ సేవలు ఎనలేనివి - 15.05.2025

నాటక రంగానికి రవికుమార్ సేవలు ఎనలేనివి

బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై రంగస్థల నటుడు, రచయిత డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ కు గురువారం రాత్రి పురస్కార ప్రదానం జరి గింది. సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావా హిని ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు జయంతి సంద ర్భంగా ఈ పురస్కారం అందించారు. సభకు యువకళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా రామరాజు ఫౌండేషన్ ప్రతినిధి రామరాజు శ్రీనివాసరావు, ఆలయ పాల కమండలి సహ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శారద కళా సమితి అధ్యక్షుడు దోగిపర్తి శంకరరావు, ఆప్కాబ్ బ్రాంచి మేనేజర్ పి. లక్ష్మీ సువర్చల, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్యలు పాల్గొని.. రవికుమార్ నాటక రంగానికి చేసిన కృషిని వివరించారు. అనంతరం డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ బృందం సత్యహరిశ్చంద్రీయం నాట కంలోని వారణాసి ఘట్టం ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కార్యక్రమాలను లంక లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు. భాగి శివశంకరశాస్త్రి, ఎంఏ హమీద్, జి.మల్లికార్జునరావు, జానీబాషా పర్యవేక్షించారు. 









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...