నాటక రంగానికి రవికుమార్ సేవలు ఎనలేనివి
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై రంగస్థల నటుడు, రచయిత డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ కు గురువారం రాత్రి పురస్కార ప్రదానం జరి గింది. సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావా హిని ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు జయంతి సంద ర్భంగా ఈ పురస్కారం అందించారు. సభకు యువకళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా రామరాజు ఫౌండేషన్ ప్రతినిధి రామరాజు శ్రీనివాసరావు, ఆలయ పాల కమండలి సహ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శారద కళా సమితి అధ్యక్షుడు దోగిపర్తి శంకరరావు, ఆప్కాబ్ బ్రాంచి మేనేజర్ పి. లక్ష్మీ సువర్చల, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్యలు పాల్గొని.. రవికుమార్ నాటక రంగానికి చేసిన కృషిని వివరించారు. అనంతరం డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ బృందం సత్యహరిశ్చంద్రీయం నాట కంలోని వారణాసి ఘట్టం ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కార్యక్రమాలను లంక లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు. భాగి శివశంకరశాస్త్రి, ఎంఏ హమీద్, జి.మల్లికార్జునరావు, జానీబాషా పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి