మాతృభక్తి మన సంస్కారం - 13,14.05.2025
తల్లికే మొదటి నమస్కారం మన సంప్రదాయమని సుందర సత్సంగ్ సభ్యుడు కేవీ కోటే శ్వరరావు తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ఆదిశంకరాచార్యస్వామి జయంతి సందర్భంగా మంగళవారం 'మాతృదేవోభవ' అనే అంశంపై కే.వీ. కోటేశ్వరరావు ప్రసంగించారు. తల్లిని గౌరవించడం మన సంస్కారమని వేదాలు పేర్కొన్నాయన్నారు. ఆ భగవంతుడి ప్రతిరూపమే తల్లి అని, ప్రాణం ఉన్నంత కాలం తల్లిదండ్రులు సేవలు చేసినవారికి సౌభాగ్యం కలుగుతుందన్నారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి