సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి