అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్ , ఆకాశవాణి , దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు , శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న, తిరుపతి వేంకట రమణ , హరే వేంకట రమణ బ్రోవరా , సప్తగిరులపై వెలసి వేంకటేశ , నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు , మాధవా కేశ మధుసూదన , ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి , నానాటి బ్రతుకు నాటకము , రంగ రంగ రంగపతి రంగనాధ్ , చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదే...
వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి