భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి