మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
వైభవంగా అన్నమయ్య జయంతి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమాచార్య విగ్రహం వద్ద గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, ఆలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్కు వేదపండితులు సతీష్ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో గాయత్రీ సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి యం.వై. శేషురాణి, డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి