ఆకట్టుకున్న భక్తి రంజని
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదిక పై స్వరరాగ సుధ ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి సందర్బంగా సోమవారం జరిగిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని, గాయకులు కేవీ సాయిబాబా శర్మ, నాగమల్లేశ్వరరావు, కృష్ణకుమారి లు తమ గాత్రధారణలో అన్నమాచార్య విరచిత పలుభక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపించారు.కీబోర్డుపై ఎం రామకృష్ణ శర్మ, తబలాపై షణ్ముఖ శర్మ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి