ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

భక్తిశ్రద్దలతో చండీహోమం - 21.08.2025

భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్దలతో చండీహోమం - 21.08.2025

భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీమద్భగవద్గీత'పై ఆధ్యాత్మిక ప్రవచనం - 21.08.2025

శ్రీమద్భగవద్గీత'పై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. బండ్లమూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగ్గా, ఆలయ పాలకవర్గం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్మయ మిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రసంగిస్తూ వేదశాస్త్ర పఠనం, పరమేశ్వరుని నామ జప సాధన వంటివి వాక్కుకు సంబంధించిన తప స్సులు అని అన్నారు. తపస్సులను ఫలకాంక్షలేని యోగులు శ్రద్ధతో ఆచరించినప్పుడు, వాటిని తపస్సులుగా పిలుస్తారని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియజేశారని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు - 16.08.2025

ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు శ్రీమహాదేవు రాధాకృష్ణ రాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత, నృత్యపాఠశాల సంయుక్త నిర్వహణలో శనివారం రాత్రి స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద జరిగిన సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మృదంగ సద్గురువుల సంస్మరణోత్సవాల పేరున కార్యక్రమం నిర్వహించారు. మహాదేవు లక్ష్మీనారాయణరాజు ప్రశిష్య బృందం మృదంగ లయ విన్యాసం అందరి మన్ననలు పొందింది. అనంతరం శాస్త్రీయ సంగీత విభావరిలో జొన్నలగడ్డ సత్యశ్రీరామ్ పలు వాగ్గేయకార కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కచేరీకి వయోలిన్పై అంబటిపూడి కామాక్షి, మృదంగంపై కుందుర్తి అరవింద్, డోలుపై కె.ఎం. మనోహర్, నాదస్వరంపై కాల్వ ఎంవీ సుబ్బరామయ్య వాద్య సహకారం అందించారు. కార్యక్రమాలను పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుభట్ల కృష్ణవేణి, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జునరావు పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతరం దేవాలయ పాలకవర్గం వారు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

వైభవంగా స్వామి నగరోత్సవం - 16.08.2025

వైభవంగా స్వామి నగరోత్సవం శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామికి ఆలయ అర్చకులు కృష్ణస్వామి అభిషే కం, అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని విశేషంగా ఆలంకరించి, మాఢవీధులలో ఊరే గింపు చేపట్టారు. స్వామి ఊంజలసేవ, తీర్థప్రసాద వితరణ జరగ్గా, భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ పాలకవర్గం కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వివిధ రంగాల్లో నిష్ణాతులకు కళాశ్రీ పురస్కారాలు - 15.08.2025

వివిధ రంగాల్లో నిష్ణాతులకు కళాశ్రీ పురస్కారాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాంజలి క్రియేషన్స్ నిర్వహణలో శ్రీ టీవీ జాతీయ కళాశ్రీ పురస్కారాల సభ శుక్రవారం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతి ప్రచారణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు సంస్థ అధ్యక్షుడు రంగస్థల, సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించారు. అధితులుగా ఏ.పీ. శిల్పారామములు చైర్మన్ మంజులా రెడ్డి టీవీ నిర్మాత నటులు డాక్టర్ వలేటి అప్పారావు తదితరులు పాల్గొని రంగస్థల నటులు మల్లాది శివన్నారాయణ (రంగస్థల టీవీ రంగం నటులు డాక్టర్ ఆరాధ్యుల కోటేశ్వరరావు (పౌరాణిక నాటక రంగం) డాక్టర్ వి.వి. రాంకుమార్( వైద్యరంగం) ఆలోకం పెద్దబ్బయ్య (ఓసామాజిక, సాంస్కృతిక రంగం) ఏ.వి. సీతా రామయ్య (తెలుగు భాషా రంగం) గాయనిపత్రినిర్మల( కళా రంగం దామచర్ల శ్రీని వాసరావు (సామాజిక, సేవా రంగం సాదినేని మురళీమోహనరావు (విద్యారంగం) లను శ్రీ టీవీ జాతీయ కళాశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం పౌరాణిక నటులు డాక...

భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు - 15.08.2025

భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు శ్రావణమాసం మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకొని  స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేషాలు అభిషేకాలు, కుంకుమార్చన, అలంకరణ జరిగాయి. భక్తులు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, వివిధ పుష్పాలతో అలంకరణ నిర్వహించారు

అలరించిన శ్రీకృష్ణ భక్తి గీతాలాపన - 14.08.2025

అలరించిన శ్రీకృష్ణ భక్తి గీతాలాపన స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయం పద్మావతీ కల్యాణ వేదికపై గురువారం శ్రీకృష్ణ భక్తి గీతాలాపన నిర్వహించారు. భక్త నారద ఆధ్వర్యంలో గానసభజరగ్గా, ఆలయ పాలకవర్గ కమిటీ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్యఅతిథు లుగా హాజరైన ఏపీ విశ్రాంత డీజీపీ ఎం. మాలకొండయ్య, కాళహస్తి సత్యనా రాయణలు మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గీతాలను ఆలపించారు. ఆలోకమే శ్రీబాలకృష్ణం సతులాల చూడరే, రాధాసమేత కృష్ణ, లీలా శ్రీకృష్ణయ్య, ముద్దుగారే యశోద, సామజవరగమన, జోఅచ్యుతానంద జోజో ముకుందా తదితర కృష్ణ భక్తిగీతాలు అలరించాయి. వయోలిన్పై డాక్టర్ ఆంజనేయశాస్త్రి, తబలాపై బాలాజీ వాయిద్య సహకారం అందించారు.

కళాకారులకు ఘన సత్కారం - 10.08.2025

కళాకారులకు ఘన సత్కారం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆది వారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం, సంస్థ వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ రసరంజని నాట్యా చార్య ఎస్కే ఖలీల్ శిష్యబృందంచే గణపతి నృత్యం, నారాయణ నారాయణ గోవింద హరే, డూడూ బసవన్న, ఓం శివోహం, పలికే బంగారుతల్లిరో మా యల్లమ్మ అంటూ పలు జానపద, కూచి పూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అనం తరం గుళ్ళపల్లి సుబ్బారావు నాట్యాచార్య ఖలీల్, శిష్యబృందాన్ని సత్కరించారు.

అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి - 09.08.2025

అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కీర్తన ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు(హైదరా బాద్) విద్వాన్ డాక్టర్ కమలారమణి శాస్త్రీయ సం గీత కచేరి, డాక్టర్ ఎం.శ్రీధర్, కీర్తన ట్రస్ట్ అధ్యక్షులు ఎం.విజయలక్ష్మి, డాక్టర్ ఎం. సుమిత్ర, ఆలయ పాలకమండలి నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. త్యాగరాజ కీర్తనలు, వాగ్గేయకార కృతులను కమలారమణి శ్రావ్యంగా గానం చేశారు. వయోలిన్పై పి.నం దకుమార్, మృదంగంపై బి.సురేష్ బాబు వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబం డ్ల లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశా ధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతి థులను సత్కరించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 08.10.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ శుక్రవారం చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితులు గణపతికి, శివ లింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

లక్ష్మీదేవి వైభవంపై ప్రవచనం - 08.08.2025

లక్ష్మీదేవి వైభవంపై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ ఆలయ ప్రాంగణం వేంకటేశ్వర స్వామి అన్నమయ్య కళావేదికపై శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి 준길 ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలక వర్గం వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ శ్రావణ శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం, హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు ఎంతో ముఖ్యమైన పండుగన్నారు. వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారన్నారు. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల సౌభాగ్యం కోసం, కుటుంబ సభ్యుల సుఖం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నారు. శ్రావణ శుక్రవారం దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమన్నారు. ఈ దేవతను పూజిస్తే అష్టశ్వర్యాలు సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం అన్నారు.

వైభవంగా వరలక్ష్మి వ్రతం - సంపదలివ్వు తల్లీ... - 08.08.2025

వైభవంగా వరలక్ష్మి వ్రతం - సంపదలివ్వు తల్లీ... స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, పద్మావతి కల్యాణమండపం వేదికగా ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య, పాలకమండలి వారి అద్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి మాధవస్వామి బృందం వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు వందల మందికి పైగా సువాసినులచే శుక్రవారం వ్రతాలు కుంకుమార్చనలు, పారాయణలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

హరిత విప్లవ సాధనకు స్వామినాథన్ ఎనలేని కృషి - 07.08.2025

హరిత విప్లవ సాధనకు స్వామినాథన్ ఎనలేని కృషి హరిత విప్లవ సాధనకు స్వామినాథన్ ఎనలేని కృషి చేశారని వక్తలు కొనియాడారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కల్యాణ వేదికపై గురువారం భారతరత్న ఎంఎస్.స్వామి నాథ్ శత జయంతి వేడుకలను గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పాలకమం డలి నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు ప్రసంగిస్తూ ఎం.ఎస్.స్వామినాథన్ గ్రీన్ రివల్యూషన్ ప్రణాళికలు, కృషి క్షేత్రం ఆధునికీకరణలో పెద్ద పాత్ర పోషించారని తెలిపారు. హరిత విప్లవ సాధనకు ఎనలేని కృషి చేశారని వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్వామినాథన్ జీవిత విశేషాలను ప్రదర్శించారు.