ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...

సైబర్ మోసాలపై అవగాహన ఉండాలి - 15.09.2025

సైబర్ మోసాలపై అవగాహన ఉండాలి

దేశ వ్యాప్తంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు బాగా పెరి గాయని, వీటి నివారణకు బ్యాంకు ఖాతాదారులు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉందని, ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ అని ఆన్లైన్ ఫోన్లు చేసిన వాటిని నమ్మవద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీ కోర్ సీఐ సమీర్ బాషా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరిగి మీ ఖాతాలలో డబ్బులు పోయినట్లు గుర్తిం చిన వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పట్టాభిపురం ఎస్ఐ తరం గిణి, ప్రదీప్ పాల్గొన్నారు.





కామెంట్‌లు