అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.
ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి
బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాయవరం సంపూర్ణ రాజ్యలక్ష్మి గాత్ర కచేరీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు గుళ్ల పల్లి సుబ్బారావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎం.వై శేషురాణి, సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి