అలరించిన వేణుగానం, గాత్ర కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం వేణుగానం, గాత్ర కచేరి నిర్వహించారు. స్వర తరంగిణి విద్యాల యం(గుంటూరు) ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమారెళ్ళ వామనకుమార్ పలు కీర్తనలను వేణు గానంతో పలికించారు. ప్రేక్షకులను అలరించాయి. సువర్ణవిద్య శిష్య బృందం వాగ్గేయకార కీర్తనలను అలపించారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్యాన్ని అందించారు.
ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి
బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాయవరం సంపూర్ణ రాజ్యలక్ష్మి గాత్ర కచేరీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు గుళ్ల పల్లి సుబ్బారావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎం.వై శేషురాణి, సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి