కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
వేదమాత గాయత్రి ప్రాణరక్షధాత్రి
శరన్నవరాత్రుల వేళ నగర దేవాలయాలన్నీ అమ్మవారి విశేష అలంకారాలతో కళకళలాడుతు న్నాయి. రెండో రోజు మంగళవారం అధికశాతం ఆలయాల్లో లోకజనని గాయత్రీ మాతగా దర్శనమిచ్చింది. మరికొన్ని ఆలయాల్లో వార విశేషాన్ని అనుసరించి మంగళగౌరి అలంకారం చేశారు. ఆలయాల సంద ర్శనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివ చ్చారు. దేవీ ఖడ్గమాల, శ్రీసూక్తం, లలితా సహస్రనామ తదితర పారాయణలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి