హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
వేదమాత గాయత్రి ప్రాణరక్షధాత్రి
శరన్నవరాత్రుల వేళ నగర దేవాలయాలన్నీ అమ్మవారి విశేష అలంకారాలతో కళకళలాడుతు న్నాయి. రెండో రోజు మంగళవారం అధికశాతం ఆలయాల్లో లోకజనని గాయత్రీ మాతగా దర్శనమిచ్చింది. మరికొన్ని ఆలయాల్లో వార విశేషాన్ని అనుసరించి మంగళగౌరి అలంకారం చేశారు. ఆలయాల సంద ర్శనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివ చ్చారు. దేవీ ఖడ్గమాల, శ్రీసూక్తం, లలితా సహస్రనామ తదితర పారాయణలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి