విశ్వనాథాష్టకంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై వ్యాస మార్చి రచించిన విశ్వనాధాష్టకం పై బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రవచకులు, సుందర చైతన్యానంద శిష్యులు కే.వీ. కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు విశ్వవ్యాప్తమై విశ్వంలోనే ఉన్నాడన్నారు. సృష్టిలోని ధర్మాలన్నీ దైవ స్వరూపమే, ధర్మమే దైవం అంటూ సృష్టి ధర్మాలే దైవస్వరూపాలు అన్నారు. ధర్మజీవనమే దైవారాధనతో సమానమన్నారు అందువల్ల చేసే ప్రతి పని పూజగా మారుతుంది. ధర్మం తోడుగా వున్నప్పుడు. దైవం వున్నట్లే అన్నారు. చేసే పనిలో ధర్మం తొంగిచూస్తే దైవం నిన్సు చేస్తున్నట్లే అని తెలిపారు. ధర్మమూ, దైవము వేరుకాదు. మన కర్మలని మార్చకుండా కర్మలలో దైన భావం ఏర్పరుచుకుంటే జీవితం యజ్ఞ స్వరూపంగా మారుతుంది. కాశీ మహా పుణ్య క్షేత్రమని విశ్వనాధ దర్శనంతో ఒక్క రోజులో పుణ్యం లభిస్తుందన్నారు. జీవితకాల ఆరాధనచేసిన ఫలితం విశ్వనాధుని ఒక్క దర్శనంతో లభిస్తుందన్నారు. వేల అన్న్మల పుణ్యం విశ్వనాధుని ఒక్క ప్రదక్షిణతో లభిస్తుందన్నారు. గంగా స్నానం మహాపుణ్యదాయకం పితృదేవతలను తరింపచేస్తుందన్నారు. గంగా గంగా అని వంద యోజనాల నుండి పలికిన సర్వ పాప విముక్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మన్నన రవిప్రసాద్, షీ, శివారెడ్డి, తూనుగుంట్ల సుందరరామయ్య, వీ. ఏకాంబరేశ్వరరావు, వీ. అరుణకుమారి పాల్గొన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి