సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం
శ్రీమద్భగవద్గీత_ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు
సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి
ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత
ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి
ఉపనిషన్మందిరం, శ్రీకాకుళం
సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి
శ్రేష్టః...., అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు
ఏ విధముగా స్ఫూర్తిదాయకము, ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల
ప్రస్తావనను వక్త వివరించారు. ప్రధానంగా
విద్యార్థులు, యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు
అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు. వక్తను
కార్యవర్గ సభ్యులు అభినందించి, సత్కరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి