గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం
గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం మంగళవారం రాత్రి జరిగింది. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఆకుల వెంకట శేషసాయి, గన్నమనేని రామకృష్ణప్రసాద్లు.. డాక్టర్ గోపాలకృష్ణయ్య వైద్య సేవలను ప్రశంసించారు. కవి రాజచరిత్ర (కమ్మజన వర కీర్తి చంద్రిక), జీవన దాత.. విద్యా ప్రదాత మద్దినేని గోపాలకృ 'ష్ణయ్య' పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. రాగాలు సుస్ధిరం: సభానంతరం ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్యప్ర సాద్ కర్ణాటక, హిందూస్థానీ సంగీతాల విశేషాలను ఉదాహరణ పూర్వకంగా రాగరవళి పేరుతో గీతాలాపన, పద్యగానాలు చేస్తూ నిర్వహించారు. సభకు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. ఎం. రవికృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్ర మంలో స్వాతి, డాక్టర్ సృజన్ కుమార్, గుళ్లపల్లి శాంతి, డాక్టర్ నేహా, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి