శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత _ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి ఉపనిషన్మందిరం , శ్రీకాకుళం సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి శ్రేష్టః.... , అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు ఏ విధముగా స్ఫూర్తిదాయకము , ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల ప్రస్తావనను వక్త వివరించారు. ప్రధానంగా విద్యార్థులు , యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు. వక్తను కార్యవర్గ సభ్యులు అభినందించి , సత్కరించారు.
వామన చరిత్ర పై ప్రవచనము
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం
వామన చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్.
మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ అహంకారము
పొందుట వలన కలిగే అనర్థాలను తెలియజేసేటువంటి చక్కటి ఘట్టమీ, ఈ వామన చరిత్ర అనేటువంటి
ఘట్టము, బలి అంటే ఆత్మబలము కలవాడన్నారు. మూడడుగుల మేర దానము ఇస్తే గనకు నువ్వు, నీ వంశము - అందరు
-నశించిపోతారు అని తెల్చి చెప్పినప్పటికీ, బలి చక్రవర్తి దానమివ్వటానికి సిద్ధపడ్డాడన్నారు. అందుకే
భగవంతుడు బలిచక్రవర్తి కి తరువాతి మన్వంతరములో ఇంద్రపదవిని ఇచ్చాడని, భగమతుడు వామనావ లూరములో
వచ్చి మహాభక్తుడయిన బలిచిత్ర వీరిని కాపాడిన విధము ఈ ఘట్టములో ఎంతో చక్కగా వివరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి