ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

హరిహరాత్మకమైనది కార్తీకం - 19.11.2025

హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ  శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.

హరిహరాత్మకమైనది కార్తీకం - 19.11.2025

హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ  శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ - 18.11.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

షట్కాల శివలింగార్చన ప్రాముఖ్యత - డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి - 18.11.2025

షట్కాల శివలింగార్చన ప్రాముఖ్యత స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కార్తీకమాసం సందర్భంగా షట్కాల శివలింగార్చన పై ఆధ్యాత్మిక ప్రవచన జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు, తూనుగుంట్ల రాధాబాయి, వెలువోలు నాగరాజ్యలక్ష్మి  జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి ప్రవచిస్తూ  షట్కాలం అంటే ఆరు సమయాలలో శివలింగాన్ని పూజించడమన్నారు. శైవ ఆగమాల ప్రకారం , శివాలయాలలో , ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పెద్ద దేవాలయాలలో , ఈ షట్కాల అర్చనను నిష్ఠగా ఆచరిస్తారన్నారు. ఈ ఆరు కాలాల్లో శివుడిని పూజించడం వల్ల సృష్టి , స్థితి , లయ అనే త్రిమూర్తుల కార్యాలు సక్రమంగా జరుగుతాయని , భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారన్నారు. ఈ ఆరు కాలాలలో శివలింగానికి అభిషేకం , అలంకరణ , ధూప , దీప , నైవేద్య సమర్పణ మరియు మంత్ర పఠనంతో పూజ చేస్తారన్నారు. ఈ షట్కాల అర్చన హిందూ ఆగమ శాస్త్రాలలో , ముఖ్యంగా శైవ సంప్రదాయంలో , చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందని తెలిపారు. డాక్టర్ తూనుగుంట్ల నాధాభాయి భారతీయ దృక్పధంలో పర్యావరణం అనే అంశంపై ప్రసంగించారు.

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే అన్నమయ్య కళావేదిక.. అదొక నిరంతర కళావాహిని గుంటూ రుతో పాటు ఇతర జిల్లాల కళాకా రులకు ఈ పేరు పరిచయమే. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మితమైంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవా లయం ఎలా ఏడాది పొడవునా భక్తులకు దైవదర్శన భాగ్యం కలిగి స్తుందో.. అలాగే ఒక్క రోజూ కూడా ఆగకుండా సాంస్కృతిక, కళా సాహిత్య కార్యక్రమాలను ఈ వేదిక అందిస్తుంటుంది. ఇక్కడ ప్రదర్శన, ఇరత కార్యక్రమాల నిర్వహణకు మూడు నెలల ముందే వేదిక తేదీలను నమోదు చేసుకోవాలి. ఈ దైనందిన కార్యక్రమాలను మొక్కుబడిగా ఎవరో ఉద్యోగికి అప్పగించి ఊరుకోరిక్కడ. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ప్రదర్శింపజేయాలి, భక్తులకు అవి ఏమేరకు ఉపకరిస్తాయనే అంశాలు పర్యవేక్షిస్తుంటారు. సభ్యులు కూడా నిర్వహణకు కావాల్సిన అంశాలను చూస్తుంటారు.   వర్షాలొచ్చినా ఆగకుండా.. అన్నమయ్య కళావేదికపై ప్రదర్శించే కార్యక్రమాల కోసం సాయంత్రం ఆరు గంటల కల్లా వంద నుంచి 200 మంది ప్రేక్షకులు వేచి చూస్తుంటారు. ప్రేక్షకులకు అనువైన కుర్చీలు తదిత...

కనులపండువగా కుమార సంభవం(శివకళ్యాణం) నృత్యరూపకం - 17.11.2025

కనులపండువగా కుమార సంభవం(శివకళ్యాణం) నృత్యరూపకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కార్తీకమాసం సందర్భంగా గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కుమార సంభవం కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ నృత్య ఆర్ట్ అకాడమి, విజయవాడ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్యబృందంచే కుమార సంభవం నృత్యరూపకం కనులపండువగా జరిగింది. తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము , కుమార స్వామి జననం వంటి అనేక అంశాలను చక్కటి హావభావాలతో కళాకారులు ప్రదర్శించారు. అనంతరం సంస్థ వారు భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్యబృందాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ కన్వీనర్ రాఘవరావు పర్యవేక్షించారు.

బాల కళారత్న పురస్కార ప్రధానం - 16.11.2025

బాల కళారత్న పురస్కార ప్రధానం   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16 వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ ముగింపు సందర్భంగా ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన జూనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకిమణుల పోటీలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ కమిటీ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు , డాక్టర్ గాజుల రామకృష్ణ , సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని జమ్ము కుసుమాంజలి , దొంతిరెడ్డి లక్ష్మీ గోపిక , నువ్వుల చిన్మయి , సిహెచ్. వి. నివేదితశ్రీ , వై.కుందనసాయి , ఆర్.ఎస్.ఎల్. ఎస్.సాయి స్పందన , ఎం.నందయామిని లను బాలకళారత్న పురస్కారంతో , మూడు రోజులు న్యాయ నిర్ణీతలుగా వ...

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం - 15.11.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ కార్యక్రమంలో శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన సీనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకిమణుల పోట ీలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు , డాక్టర్ పి. నాగశ్రీహరిత , కాజా శ్యాంసుందరరావు , సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని  పెద్దిరాజు హర్షిత , మంగల సుధాశాన్వి , నారా లక్ష్య, గాజుల లోచన శ్రీవర్షిత ,  గోండి హన్వికశ్రీ , ఆదిరాజు హృతిక, తిరునగరి సుహిత లను బాలకళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక...

చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ ప్రారంభం - 14.11.2025

చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన సీనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకుల పోటీ సందర్భంగా ప్రదర్శించిన కూచిపూడి నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉత్తమ ప్రదర్శన చేసిన 5గురు కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, పర్చూరు మండల విద్యాశాఖాధికారి 1 డాక్టర్ అల్లూరు శివకోటేశ్వరరావు, విద్యాశాఖాధికారి పండలనేని వెంకటరామయ్య తదితరులు పాల్గొని అక్షిత, అధ్వైతరెడ్డి, రుషికా వైష్ణో, అన్వితశర్మ, ఉప్పాడ రుహిక, కొల్లి అక్షయ, కొట్టె తన్మయశ్రీ లను బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్ళూరి ధరణిలు తదితరులు పర్యవేక్షిం...

ఆచార్య గంగప్ప స్మారక పురస్కారం - 13.11.2025

అనువాదం చాలా కష్టమైన పని   ప్రముఖ పరిశోధకులు ఆచార్య గంగప్ప సాహితీ పురస్కార సభలో ముఖ్యఅతిథిగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ అనువాదం అనేది చాలా కష్టమైన పని అని తెలిపారు. సాహిత్యంలో ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదించేటప్పుడు భావం తప్పనిసరిగా రావాలి అని ఉద్ఘాటించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం ఆచార్య గంగప్ప స్మారక పురస్కార సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు ఆకాశవాణిలో 50 నాటికలు, నాటకాలు ప్రదర్శించారని తెలిపారు. నల్లనివాడు అనే రెడియో నాటకానికి జాతీయ అవార్డు అందుకున్నారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వల్లభరావు కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారన్నారు. త్రిపురనేని రామస్వామి, పింగళి వెంకయ్యల జీవితాలను తెలుగులోను, హిందీలోను వ్రాశారన్నారు. జస్టిస్ రామకృష్ణప్రసాద్ పురస్కర గ్రహీతను ఘనంగా సత్కరించి 5 వేల రూపాయల నగదు అందజేశారు. సభలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కందిమళ్ళ సాంబశివరావు, వెన్నిశెట్టి సింగారావు, ...

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

ఆకట్టుకున్న కీర్తనల గానం - 09.11.2025

ఆకట్టుకున్న కీర్తనల గానం స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం రాత్రి భక్తి మాల పేరుతో నిర్వహించిన గీతాలాపన కార్య క్రమం ఆకట్టుకుంది. తొలుత ఆలయపాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి, చింతలపాటి రమామహేశ్వరి, సోనాముఖి, పావని, హేమకుసుమ, లక్ష్మీదేవి, జీవనజ్యోతి, దుర్గ, పార్వతి, సుభాషిణి, యశోద, ఉష, ఉమ, నాగరవళి, లోకేశ్వరి, భారతి, కామాక్షి, సుజాత, లక్ష్మీకుమారి, భారతి, ముర ళీకృష్ణ, బ్రహ్మేశ్వరిలు పలు కీర్తనలు ఆలపించారు. వీటికి డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ స్వరకల్పన చేశారు. మల్లికార్జునరావు పర్యవేక్షించారు.