ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి - 15.10.2025

అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధ వారం అన్నమాచార్య సంకీర్తన లహారి నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం జీవిత విశేషాలు, విజయాలను సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. అనంతరం డాక్టర్ జె.కృష్ణకుమారి పర్యవేక్షణలో మోహనగానం వైకుంఠమే సంస్థ సభ్యులు అన్నమాచార్య కీర్తనలు అలపించారు. రుక్మిణి వరప్రసాద్, సునీత, రమణి, ఇందు తమ గాత్రధారణలో అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి ప్రసిద్ధ కీర్తనలను ఆలపించగా, ప్రేక్షకులను మెప్పించాయి. కీబోర్డుపై సాయి, తబలాపై రమణ వాయిద్యాన్ని అం దించారు. కార్య క్రమంలో మహిళా విభాగం కోశాధికారిణి డాక్టర్ మైలవరపు లలితకుమారి, సభ్యులు పాల్గొన్నారు.

అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి - 15.10.2025

అలరించిన అన్నమాచార్య సంకీర్తనలహరి స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధ వారం అన్నమాచార్య సంకీర్తన లహారి నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం జీవిత విశేషాలు, విజయాలను సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. అనంతరం డాక్టర్ జె.కృష్ణకుమారి పర్యవేక్షణలో మోహనగానం వైకుంఠమే సంస్థ సభ్యులు అన్నమాచార్య కీర్తనలు అలపించారు. రుక్మిణి వరప్రసాద్, సునీత, రమణి, ఇందు తమ గాత్రధారణలో అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి ప్రసిద్ధ కీర్తనలను ఆలపించగా, ప్రేక్షకులను మెప్పించాయి. కీబోర్డుపై సాయి, తబలాపై రమణ వాయిద్యాన్ని అం దించారు. కార్య క్రమంలో మహిళా విభాగం కోశాధికారిణి డాక్టర్ మైలవరపు లలితకుమారి, సభ్యులు పాల్గొన్నారు.

నలోపాఖ్యానంలోని హంస-నలుని వృత్తాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 13, 14.10.2025

నిషాధ రాజ్యానికి రాజు నలుడు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై ప్రబంధ సాహిత్యం - ఆధ్యాత్మికం ప్రవచనాల్లో భాగంగా మంగళవారం నలోపాఖ్యానంలోని హంస-నలుని వృత్తాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయ బాబు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రసంగిస్తూ నలుడు నిషాధ రాజ్యానికి రాజని అన్నారు. ఆయన దమయంతి అనే విదర్భ యువరాణిని వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఒకరోజు నలుడు తన తోటలో విహరిస్తుండగా, ఆయన ఒక అందమైన హంసను పట్టుకున్నాడని తెలిపారు. ఆ హంస మానవ భాషలో మాట్లాడిందని అన్నారు. నలుని వద్దకు దమయంతి వద్దకు రాయబారంగా వెళ్లి, ఆమెకు నలుని గురించి చెప్పిందన్నారు. ఆ తర్వాత, దమయంతి స్వయంవరంలో నలుడు, దమయంతిని ఎంచుకున్నాడని హంస- నలుని వృ ంత్తాంతాన్ని విపులంగా వివరించారు.

అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి - 12.10.2025

అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న వాగ్గేయ కార సంగీత, నృత్య ఉత్సవాలు ఆదివారంతో ముగి శాయి. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వ ర్యంలో జరగ్గా, చిగురుపాటి కమల జ్యోతిప్రజ్వల నతో ప్రారంభించారు. స్థానిక కళాకారులు వాగ్గేయ కార కీర్తనల గానం చేశారు. బీవీఎన్.ప్రణతి, వైష్ణవి తోడి ఆడిటల వర్ణంతో ప్రారంభించి అన్నమయ్య కీర్తనలను, డి.లలిత, రాజ్యలక్ష్మీ భైరవి ఆది తాళ వర్ణం ఉత్తుక్కాడు వెంకట సుబ్బయ్యర్ ఎన్.సి. కృష్ణ మాచార్య కృతులను అలపించారు. సాయంత్రం కార్యక్రమాలను రేడియాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ సుజాత, డాక్టర్ జె.నరేష్బాబు, విశ్రాంత అధ్యా పకులు ఎన్. తిరుపతయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సంగీత రత్నమణి పద్మశ్రీ శ్రీనివాసన్ (చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో సన్మండలి అధ్యక్షు రాలు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై.శే షురాని, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజ యలక్ష్మి పాల్గొనగా, అనంతరం కళాకారులను, అతి థులను సత్క...

వాగ్గేయకార సంగీత, నృత్య ఉత్సవాలు ప్రారంభం - 11.10.2025

వాగ్గేయకార సంగీత, నృత్య ఉత్సవాలు ప్రారంభం స్థానిక బృందావన్‌గార్డెన్స్‌లో శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో వాగ్గేయకార సంగీత, నృత్య ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించనున్న ఉత్సవాలను డాక్టర్ వి.రాధిక జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం కళాకారులతో వాగ్గేయకార కీర్తనల గానం నిర్వ హించారు. డాక్టర్ కె. మృణాళిని, ఎం.మాధవికృ ష్ణ కల్యాణ రాగవర్ణం, క్షేత్రయ్య పదం, జావళి, ఎంవై. శేషురాణి సావేరి వర్ణం, సీతారామారావు రాగమాలిక శ్రావ్యంగా గానం చేశారు. పలువురు కళాకారులు వాగ్గేయకార కీర్తనలను ఆలపించారు. సాయంత్రం నృత్య కార్యక్రమాలను అదనపు సొలిసిటర్ జనరల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ చల్ల ధనుంజయ, రేడియాలజిస్ట్ డాక్టర్ జి.జాహ్నవి జ్యోతి ప్రజ్వలన చేశారు. వాగ్గేయకార వైభవం నృత్యాన్ని ప్రారంభించారు. నాట్యమయూరి డాక్టర్ బిందుఅభినయ్, శిష్య బృందం నృత్యాభినయం చేయగా అలరించింది. కార్యక్రమంలో సన్మండలి అధ్యక్షులు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై. శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరా జేశ్వరి, లలితదేవి, మీనాక్షి, కార...

శ్రీమద్భగవద్గీత ప్రవచనములు - 06.10.2025 - 10.10.2025

శ్రీమద్భగవద్గీత ప్రవచనములు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం శ్రీమద్భగవద్గీత అష్టాదశ మోక్షసన్యాసయోగంపై అధ్యాత్కిర ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నయ బ్రహ్మచారి సన్యాన సువీరానంద స్వామి ప్రవచిస్తూ మోక్షసన్యాసయోగంలో తత్తము, త్యాగతత్త్వము గూర్చి తెలియజేస్తూ పుత్ర ధనాది ప్రియ వస్తు ప్రాప్తికి, రోగములు మొదలగు వాటిని నివృత్తికి చేసే ఉపాసనలను సన్యాసమని, సర్వకర్మ ఫలములను తృజించుటను త్యాగమని అంటారన్నారు. సన్మానము త్యాగము అనే రెండు విషయాలని, త్యాగము సాత్వికము, రాజనము, తామసము అని మూడు విధాలుగా చెప్పబడ్డాయన్నారు.

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 06.10.2025

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు, నిర్వహించి, పలు రకాల హెూమ ద్రవ్యాలతో పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సంగీత విభావరి - 05.10.2025

అలరించిన సంగీత విభావరి స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం భక్తి సంగీత విభావరి నిర్వహించారు. భక్తిగాన లహరి ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. బోడపాటి శ్రీనివాసరావు బృందంతో పలు భక్తి గీతాలను ఆలపించారు. కీబోర్డుపై సాయి, తబలపై రమణ వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ పాల్గొని బోడపాటి శ్రీనివాసరావునునగా సత్కరించారు.

ఆకట్టుకున్న తాళంభజన - 04.10.2025

ఆకట్టుకున్న తాళంభజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం శ్రీ ఆంజనేయ భక్త సమాజం, ఉన్నవ వారి భజన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ మహిళా కళాశాల సంస్కృతాధ్యపకులు డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి కబీరు హిందీలో రచించిన పద్యాలను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వరరావు తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాన్ని ద్వితీయ ముద్రణ చేశారని తెలుపుతూ కబీర్ సర్వమానవ సమానత్వంపై రాసిన పద్యాలు సమాజంలో ఒక మంచి అనునయాన్ని కల్పించాయన్నారు. భూసురపల్లి విజయలక్ష్మికి మొదటి ప్రతిని అందించారు. కార్యక్రమంలో గుళ్ళపల్లి సుబ్బారావు, పెద్ది సాంబశివరావు కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. అనంతరం ఆంజనేయ భక్త సమాజం ఉన్నవ కుర్రా ఆంజనేయులు బృందంచే పలు భక్తిగీతాలను ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

పండుగల విశిష్టతపై ప్రవచనం - 03.10.2025

పండుగల విశిష్టతపై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శుక్రవారం ప్రముఖ జ్యోతిష్య పండితుడు నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి వచ్చే పండుగల విశిష్టతపై ప్రవచనం చేశారు. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్ర జ్వలనతో ప్రారంభించారు. 

వైభవంగా ముగిసిన శరన్నవరాత్రులు - 02.10.2025

 

విష్ణువిలాసిని.. విశ్వవినోదిని - 01.10.2025

 విష్ణువిలాసిని.. విశ్వవినోదిని