ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

హరిహరాత్మకమైనది కార్తీకం - 19.11.2025

హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ  శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.

ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం - 27.10.2025

ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు. నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మ...

అలరించిన సినీ సంగీత విభావరి - మహతీ స్వరసుధ వారి కార్యక్రమము - 26.10.2025

అలరించిన సినీ సంగీత విభావరి - 26.10.2025 స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతీ స్వరసుధ ప్రత్యేక సినీ సంగీత విభావరి నిర్వహించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపకురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో గుళ్లపల్లి సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేం ద్రరావు, ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఆతుకూరి సుబ్బారావు, విశ్రాంత ఈఈ చందు వేంకటాద్రి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య జ్యోతిప్రజ్వ లనతో ప్రారంభించారు. గాయని గాయకులు కె.రసూల్ బాబు, సురభి శ్రావణి, ఎస్. కమల్ కిశోర్, జి.హారిక, పత్రి నిర్మల, సి.హెచ్. రాజ్యలక్ష్మి, బి. కృష్ణప్రసాద్, మధులత, ప్రహర్షిత సినీ గీతాలను ఆలపించారు. కీబోర్డుపై కె.రవిబాబు, తబలాపై ఎస్.వెంకట్, ప్యాడ్స్పై టి.ఈశ్వర్ వాయిద్యాన్ని అందించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యతగా వ్యవహరించగా, కార్యదర్శి మద న్మోహనరావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ - 23.10.2025

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ   ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు . ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని , జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య చేస్తారని , విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి , శాసనమండలి పూర్వ సభ్యులు కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు . ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్ , సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు , ఏప...

ఆకాశదీపం ప్రారంభం - 22.10.2025

ఆకాశదీపం ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందంచే ములవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ద్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించి పూజలు నిర్వహించి ఆకాశదీపం అరోహణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు, సువాసినీలు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పద్మావతి కళ్యావేదికపై శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామిచే మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 19.10.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి , శివలింగానికి , నవగ్రహాలకు విశేష అభిషేకాలు , అర్చనలు , లక్ష్మీగణపతి , చండీ , రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. శ్రీమతి ధూళిపాళ్ల జోతిర్మయి, ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య , ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

అలరించిన భక్తిసంగీత విభావరి - 18.10.2025

అలరించిన భక్తిసంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం భక్తిగాన లహరి వారిచే భక్తిసంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోడపాటి శ్రీనివాసరావు(జె.కె.సి. శ్రీను), సాంబశివరావులు తమ గాత్రధారణలో పలు భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆలరింపజేశారు. కీబోర్డుపై లక్ష్మణ్, తబలాపై రమణ, ప్యాడ్స్‌ పై రవికుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి ఏ.వి.కె. సుజాత  వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అలరించిన భక్తిసంగీత విభావరి - 17.10.2025

అలరించిన భక్తిసంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం కళాంజలి, గుంటూరు వారిచే భక్తిసంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రముఖ గాయకులు షేక్ రసూల్‌బాబు, పత్రి గాయత్రి, శ్రీపత్రి లలిత్‌బాబు, ఆర్. సాంబశివరావు లు తమ గాత్రధారణలో పలు భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆలరింపజేశారు. కీబోర్డుపై కె. రవిబాబు, తబలాపై వెంకట చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాలను తొట్టెంపూడి రమేష్ పర్యవేక్షించారు.

శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సమావేశం - 16.10.2025

శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సమావేశం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో   మలయాల స్వామి వారిచే ఏర్పేడులో 1926లో ఏర్పాటు చేసిన శ్రీవ్యాసాశ్రమ శతజయంతి ఉత్సవాలు త్వరలో నిర్వహించనున్నట్లు ప్రస్తుత పీఠాధిపతి శ్రీశ్రీ పరిపూర్ణానందగిరిస్వామి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో వారు ఈ శతాబ్ది ఉత్సవాలను 2026 ఫిబ్రవరి 20 నుండి 26 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు,   ఆలయ కమిటి సభ్యులు, అతిథులు తదితరులు పాల్గొన్నారు.