ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అలరించిన కదంబ కార్యక్రమం - 01.07.2025

అలరించిన కదంబ కార్యక్రమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాష్ర్ట సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కదంబ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత దేవాలయ పాలకవర్గం ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన  సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయ విశిష్టతలను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి ప్రసిద్ధ కవి దాశరధి జయంతి సందర్భంగా ఆయన కవితావైభవాన్ని గురించి ప్రసంగించారు. డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు తమ గాత్ర ధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు.

అలరించిన కదంబ కార్యక్రమం - 01.07.2025

అలరించిన కదంబ కార్యక్రమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాష్ర్ట సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కదంబ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత దేవాలయ పాలకవర్గం ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన  సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయ విశిష్టతలను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి ప్రసిద్ధ కవి దాశరధి జయంతి సందర్భంగా ఆయన కవితావైభవాన్ని గురించి ప్రసంగించారు. డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు తమ గాత్ర ధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు.

సుబ్బారావు సేవలు ప్రశంసనీయం - 30.06.2025

సుబ్బారావు సేవలు ప్రశంసనీయం రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, విద్య, కళా సాంస్కృతిక రంగాలకు భారీ విరాళాలందిస్తున్న గుళ్లపల్లి సుబ్బారావు సేవలు అభినందనీయమని బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమ వారం రాత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుళ్లపల్లి సుబ్బారావును పలువురు ఘనంగా సన్మానిం చారు. సన్మాన గ్రహీత సుబ్బారావు మాట్లాడారు.

ఆకట్టుకున్న వాగ్గేయకార సంకీర్తనం - 29.06.2025

ఆకట్టుకున్న వాగ్గేయకార సంకీర్తనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం శ్రీ అవధూతేంద్ర భక్తబృందం, గుంటూరు వారి వాగ్గేయకార సంకీర్తన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీహరి శరణ్ మహరాజ్ బృందంచే జయజయ గణనాయక, జయగురు జయగురు సశ్చిదానంద గురు, హరేరామ హరేరామ రామరామ హరేహరే అంటూ పలు వాగ్గేయకార కీర్తనలను ఆలపించి కీర్తనల యొక్క సారాంశాన్ని చక్కగా ప్రవచన రూపంలో వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి డోలక్‌పై షణ్ముక వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం సంకీర్తనబృందాన్ని సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ఆకట్టుకున్న తాళం భజన - 28.06.2025

ఆకట్టుకున్న తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సిద్ది విఘ్నేశ్వర భజన సమాజం, గోగులమూడి వారి తాళం భజన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వై. భాస్కరరావు  బృందంచే జయ జయ వినాయక, కస్తూరి తిలకం నారాయణం, కౌశల్య సుప్రజ రామచంద్ర సీతామనోహర రామచంద్ర అంటూ పలు వాగ్గేయకార కీర్తనలును తాళంభజన రూపంలో ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆలయ కమిటి సభ్యులు కన్నెగంటి బుచ్చయ్యచౌదరి సౌజన్య సహకారం అందించారు. వీరికి హార్మోనియంపై శ్రీనివాస్, డోలక్‌పై శ్రీనివాస లు వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం భజన బృందానికి పాలకవర్గం వారి ఘనంగా సత్కరించారు.