భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
అలరించిన గాత్రకచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ప్రముఖ గాయకురాలు రాగమయూరి నిర్వహించిన గాత్రకచేరి అలరించింది. నాగార్జున సంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేజీ శంకర్ ప్రారంభించారు. రాగమయూరి పలు త్యాగరాజ కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి మృదంగంపై రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాన్ని సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి కే.సూర్యనారాయణ పర్యవేక్షించారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి