భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన గాత్రకచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ప్రముఖ గాయకురాలు రాగమయూరి నిర్వహించిన గాత్రకచేరి అలరించింది. నాగార్జున సంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేజీ శంకర్ ప్రారంభించారు. రాగమయూరి పలు త్యాగరాజ కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి మృదంగంపై రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాన్ని సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి కే.సూర్యనారాయణ పర్యవేక్షించారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి