సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. సుమారు నలభై మంది విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అందిం చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి