అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్ , ఆకాశవాణి , దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు , శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న, తిరుపతి వేంకట రమణ , హరే వేంకట రమణ బ్రోవరా , సప్తగిరులపై వెలసి వేంకటేశ , నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు , మాధవా కేశ మధుసూదన , ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి , నానాటి బ్రతుకు నాటకము , రంగ రంగ రంగపతి రంగనాధ్ , చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదే...
భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి చిన్మయా మిషన్ సువీరానందస్వామి భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం గురించి ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కె.పూర్ణచంద్రరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కాటాబత్తుల పూర్ణచంద్రరావు రాధ పాల్గొన్నారు.