మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం స్త్రీలను గౌరవించే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే తొలినాళ్ల నుంచి మనదేశంలో మహిళలకు గౌరవ స్థానమిచ్చారని నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట మహిళలను గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సత్కరించారు. న్యాయవాది, రచయిత్రి నల్లూరి రుక్మిణి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవిలను శాలువా, జ్ఞాపిక, సన్మాన పత్రాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎం. వేదవతి, గుళ్లపల్లి స్వాతి, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, అర్థలపూడి నేహా తదితరులు పాల్గొన్నారు. యడ వల్లి శ్రీదేవి బృందం బుర్రకథ ఆకట్టుకుంది.
కనుల పండువగా సీతారాముల కల్యాణం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవాచారి, కృష్ణ, సతీష్ చిన్మయి బృందంచే శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. హారతి, అనంతరం విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి శ్రీరామ పట్టాభిషేకంపై ప్రవచనం చేశారు. కార్యక్రమాల్ని ఆలయ పాలకమండలి వారు పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి