అలరించిన భక్తి గీతాలాపన
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంక టేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై శుక్రవారం సాయంత్రం మధురవళి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు రాధామైథిలి శిష్య బృందం కృష్ణ చంద్రిక, వరలక్ష్మి, సుజాత, తన్వీశ్రీ తమ గాత్రధారణలో పలు అన్నమయ్య సంకీర్తనలు, భక్తి గీతాలను ఆలపిం చారు. ప్రేక్షకులను అలరించాయి. కీబోర్డుపై జి.సాయి, తబలపై పి.వి.రమణ వాయిద్య సహకా రాన్ని అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి