నాగాచారికి కాళహస్తి కళావాహిని పురస్కారం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం ప్రముఖ రంగస్థల నటులు, హార్మోనిస్టు దివంగత పోత కమూరి కాళహస్తీశ్వరరావు వర్ధంతి సభ నిర్వ హించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సి. హెచ్.మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కాళహస్తి కళావాహిని అధ్య క్షుడు ఎంవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్య దర్శి పోతకమూరి తారకబ్రహ్మాచార్యులు, హిం దూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఆచా ర్యులు ఎల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రసంగించారు. యెల్లంపల్లి యరజర్ల నాగాచారికి కాళహస్తి కళావాహిని పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఎం .అర్జునరావు దర్శకత్వంలో నర్తనశాల పౌరా ణిక నాటకం ప్రదర్శించారు. కీచకుడిగా ఎం.ఆర్జునరావు, విరాటరాజుగా బి.శ్రీనివాసులు, కంకుభట్టు ఎస్. గాబ్రియేలు, వలలుడు ఎం .శ్రీనివాస్, బృహన్నల జి.మధుసూధనరావు, తంత్రిపాలుడు ఎస్. బ్రహ్మాజీరావు, సుధే ష్టదేవి సురభి విజయలక్ష్మి తదితరులు తమ నటన చాతుర్యంతో నాటకాన్ని రక్తి కట్టించారు. పి.వినాయకరాజ్ బృందం సంగీతాన్ని సమ కూర్చగా, కళాకారులను సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి