వారాహి స్తుతి సర్వరక్షా కవచం వారాహి అమ్మవారిని స్తుతి సర్వరక్షా కౌచం వంటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు కె.వి. కోటేశ్వరరావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికగా బుధవారం వారాహి వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు మన్నవ రవిప్రసాద్, పీ. శివారెడ్డి, ఏకాంబరేశ్వరరావు, బసవేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ సర్వవ్యాపకుడు, శక్తిమంతుడు, సర్వజ్ఞుడు ఐన భగవంతుడు, ధర్మానికి హాని కలిగి అధర్మం ప్రజ్వరిల్లినపుడు తనంతట తానుగా ధర్మ రక్షణ కోసం అవతరిస్తారన్నారు. రాక్ష సంహారం కోసం భగవంతుడు అనేక రూపాలలో ఆవిర్భవిస్తారన్నారు. ఆలా ఆవిర్భవించినప్పుడు అవతారానికి తగిన నామము, యంత్రము, తత్వజ్ఞానము, మోక్షము సాధకులకు అనుగ్రహిస్తారన్నారు. మనిషి రాక్షసుడుగా ఎందుకు మారతాడు అంటే పొందిన వరాలను దుర్వినియోగం చేసుకొని, సమాజానికి కంటకంగా మారి అశాంతి నెలకొన్నప్పుడ...
విశ్వావసుకు వినమ్ర స్వాగతం
విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి