యమ, నచికేతుల సంవాదమే కఠోపనిషత్తు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వస్తున్న ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యా త్మిక ప్రవచనాలు శుక్రవారం ముగిశాయి. బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ యముడు నచికేతుడిని ప్రాపంచిక సుఖాలు, సంపదలతో ప్రలోభపెట్టిన, అతను వాటన్నింటినీ తిరస్కరించి కేవలం ఆత్మజ్ఞానం కోసమే పట్టుబడతాడని అన్నారు. నచికేతుని వైరాగ్యానికి, జిజ్ఞాసకు సంతోషించిన యముడు శరీరం ఒక రథమైతే, ఆత్మ అందులోని రథికుడని వివరిస్తూ, జనన మరణాలు లేని నిత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడని పేర్కొన్నారు.
విశ్వావసుకు వినమ్ర స్వాగతం
విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి