ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ప్రదర్శించిన నృత్యకిన్నెర, హైదరాబాద్ వారి కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సభ్యులు, సంస్థవారు జ్యోతిప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు, హంస అవార్డు గ్రహీత గురు డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం యశస్వినిశ్రీ, శ్రద్ధ వారణాసి,సహస్ర, చెరిష్య, కార్తీక, ప్రణీత, చాతుర్యశ్రీ లు వినరో భాగ్యము విష్ణుకథతో ప్రారంభించి శ్రీమన్నారాయణ, నారాయణతే నమో నమో పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి రసజ్ఞులను ఆకట్టుకున్నారు.
విశ్వావసుకు వినమ్ర స్వాగతం
విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి