హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
విశ్వావసుకు వినమ్ర స్వాగతం
విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి