ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుం తలం నృత్యరూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచి పూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయం చారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్రగుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.
భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి చిన్మయా మిషన్ సువీరానందస్వామి భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం గురించి ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కె.పూర్ణచంద్రరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కాటాబత్తుల పూర్ణచంద్రరావు రాధ పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి