అలరించిన శ్రీరామ గానామృతం
బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భక్త నారద గాన సభ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన శ్రీరామ గానామృతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత విశ్రాంత అదనపు ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, సంగీత విద్వాంసుడు కేవీ బ్రహ్మానందం, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి వెలిగించారు. సంగీత విద్వాంసుడు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య భక్తి గీతాలను ఆలపించారు. వయోలిన్ పాలపర్తి ఆంజనేయశాస్త్రి, మృదంగంపై కాకరపర్తి జగన్మోహిని వాద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం కోదండ రామయ్యను నిర్వాహకులు సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి