ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్ఫూర్తిప్రదాత రాణాప్రతాప్ సింగ్ - 09.05.2025

స్ఫూర్తిప్రదాత రాణాప్రతాప్ సింగ్ రాణాప్రతాప్ సింగ్ స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం ఆధ్వర్యంలో రాణాప్రతాప్ సింగ్ జయంతిని శుక్రవారం రాత్రి నిర్వహించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈసందర్భంగా పత్రి గాయత్రీదేవి భక్తి సంకీర్తన చేశారు. సభాధ్యక్షుడిగా రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ రామరాజు శ్రీనివాస్, భాజపా రాష్ట్ర అధి కార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ, నూతలపాటి తిరుపతయ్య, డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి, షిండే లక్ష్మీనారాయణ, సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీధర్ బాబు తదితరులు ప్రసంగించారు. ఇదే వేదికపై డాక్టర్ రాజపుత్ర మాధు రీవిజేతసింగ్, బాణాల వెంకట సాయిమణికంఠ, రాజపుత్ర కార్తికలకు ప్రతిభా పురస్కారాలిచ్చి నిర్వాహకులు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్షత్రి ధర్మనారాయణసింగ్, ఛత్రపతి శివాజీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి జాజం సుబ్రహ్...

ఆదర్శ మహిళ అహల్యాబాయి - 01.04.2025

ఆదర్శ మహిళ అహల్యాబాయి

పోరాటయోధురాలు అహల్యాబాయి జీవితాన్ని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ మంగళవారం రాత్రి నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రాధాబాయి మాట్లాడుతూ. దేశం, సమాజ చైతన్యం కోసం నిస్వార్ధ పోరాటం చేసిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం డాక్టర్ వెలువోలు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వాల్మీకి రామాయణం సుందరకాండలోని త్రిజట స్వప్నం విశిష్టతను వివరించారు. ఈసందర్భంగా ఇటీవల కళారత్న పురస్కారం స్వీకరించిన దేవాలయ పాలకవర్గం అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి, సభ్యులు డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, చందు హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...