పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవం, మల్లాది చంద్ర శేఖరశాస్త్రి శత జయంతి నిర్వహించారు. భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్), శ్రీరామకృష్ణా నాట్య మండలి సంయుక్తంగా నిర్వ హించగా, డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అధ్యక్షత వహించారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారంతో సత్కరిం చారు. కార్యక్రమంలో సినీ నటులు మల్లాది రాఘవ రావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తా నయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డాక్టర్ చింతలపాటి శూలపాణి, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. సభానంతరం ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రేక్షకులను అలరించింది.
స్వచ్ఛంద సేవలు అభినందనీయం భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...