దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది శత్రుదేశాల నుండి మనదేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని మేజర్ జర్నల్ మాదినేని రమేష్ బాబు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్తో యుద్ధం-సింధూరం పై విశ్లేషణ ప్రసంగం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గుడిపూడి వెంకటరాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేజర్ జర్నల్ మాదినేని రమేష్బాబు మాట్లాడుతూ యుద్ధం అనేది ఆర్మీకో ఎయిర్ఫోర్స్ కో నేవీ కో చెందినది కాదన్నారు. యుద్ధంలో దేశంలోని పౌరులందరు భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనకు, భవిష్యత్ తరాలకు, ఉన్నది ఒకటే దేశమన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకుల బాగస్వామ్యంతో విజయం సాధించామన్నారు. సభలో నాదెండ్ల మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సేవలు అభినందనీయం భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...