ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మికత శాంతికి సోపానం - 02.03.2025

ఆధ్యాత్మికత శాంతికి సోపానం  సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు శాంతి వర్ధిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  గళ్ల మాధవి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాబిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం శేష వాహన సేవ ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తిరుమలలో జరిగినట్లుగానే గుంటూరులో ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భీమవరానికి చెందిన త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భాగవత విశేషాలను వివరించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాస నాథ్ కుంభాబిషేక విశిష్టతను వివరించారు. వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవస్థాపకుడు బొల్లే పల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. లంకా సూర్యనారాయణ, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదే...

ఆధ్యాత్మికత శాంతికి సోపానం - 02.03.2025

ఆధ్యాత్మికత శాంతికి సోపానం  సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు శాంతి వర్ధిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  గళ్ల మాధవి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాబిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం శేష వాహన సేవ ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తిరుమలలో జరిగినట్లుగానే గుంటూరులో ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భీమవరానికి చెందిన త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భాగవత విశేషాలను వివరించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాస నాథ్ కుంభాబిషేక విశిష్టతను వివరించారు. వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవస్థాపకుడు బొల్లే పల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. లంకా సూర్యనారాయణ, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదే...

మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం - 01.03.2025

మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాభి షేక మహోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చేశారు. తితిదే ఆగమపండి తులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహా చార్యుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, వేదస్వస్తి తదితర పూజాకార్యక్రమాలు జరి గాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. ఆష్టాక్షరీ పీఠ సంపత్కు మార రామానుజ జీయర్స్వామి, బ్రహ్మనిష్ఠా నంద సరస్వతీస్వామి, బృందావన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి కుంభాభిషేక విశిష్టతను వివరించారు. సభలో యలమంచిలి శివాజి, జూపూడి రంగరాజు, బొల్లేపల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు ప్రసం గించారు. కార్యక్రమాలను లంకా విజయబాబు, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్ట ప్రభాకరరావు, సూర్యదేవర వెంకటేశ్వరరావు తదితరులు పర్య వేక్షించారు. 

కళాకారిణికి పురస్కార ప్రదానం - గాయత్రీ మహిళా సంగీత సన్మండలి - 28.02.2025

కళాకారిణికి పురస్కార ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వ ర్యంలో గోవిందరాజుల శారద స్మృతిగా సంగీత సభ శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎం. రమణప్రసాద్, ఆత్మీయ అతిథిగా కృష్ణ మైలవరపు (అమెరికా) పాల్గొ న్నారు. తొలుత నీరజా కిరణ్ మందపాటి కార్య క్రమాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. యువ కళాకారిణి చాగంటి రమ్యకిరణ్మయి(చెన్నై)కి యువ సంగీతరత్న బిరుదు పురస్కారమిచ్చి ఆలయ పాలకమండలి ఆధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య, పాలవర్గ సభ్యులు సత్కరించారు. అనంతరం రమ్యకిరణ్మయి శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ చేశారు. కార్యక్రమా లను సంస్థ ఆధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవ పెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కళాకా రులను అతిధులను సత్కరించారు.