విశిష్టమైనది మానవజన్మ సమస్త జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంతో విశిష్టమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు నిష్టల నరసింహమూర్తి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం గురువైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిష్ఠల నరసింహమూర్తి గురు పౌర్ణమి ప్రాధాన్యతను వివరిస్తూ శంకరులును జగద్గురువులు అని ఎందుకు అంటారో వివరించారు. గురువు త్రిమూర్త్యాత్మకుడు అని అనడానికి కారణము, అష్టావక్రుడు, జనకునికి బ్రహ్మోపదేశం చేసిన తీరు వివరించారు. ఏది ఏమైనా గురు ప్రసాద ధన్యత నాస్తి సుఖం మహితలే గురువుగారి అనుగ్రహము కన్నా ప్రపంచంలో సుఖమనేది ఎక్కడ లభించదని తెలియజేశారు.
స్వచ్ఛంద సేవలు అభినందనీయం భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...