ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం - 31.03.2025

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
ఆకట్టుకున్న సంప్రదాయ సంగీత కచేరి భావి తరాలకు సంప్రదాయ సంగీతాన్ని అందించటమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ వైవీకే దుర్గాప్రసాదరావు అన్నారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తోన్న వాగ్గేయకార మహోత్సవాలు 27.10.2024 ఆదివారం ముగిశాయి. డాక్టర్ వై.శైలజ , ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సన్మండలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పి.విజయ , ఎంవై. శేషు రాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ దుర్గప్రసాదరావు మాట్లాడుతూ కొన్నాళ్లుగా సన్మండలి నిర్వహిస్తోన్న సేవలు ప్రశంస నీయమని అన్నారు. అనంతరం విదుషి కస్తూరి కమలదీప్తి (విశాఖపట్నం) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. వయోలిన్పై మందా శ్రీరమ్య(చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్ (చెన్నై) వాయిద్యాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి , ఎం.మీనాక్షి , పి.లలితదేవి , కార్యదర్శి ఎ.మంగాదేవి , కోశాధికారి ఎం. విజ...
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 శ్రీమద్భాగవతం – రుక్మిణీ కళ్యాణము ప్రవచనం ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళ్యాణవేదికపై 21.10.2024 సోమవారం శ్రీమద్భాగవతం ధారావాహిక ప్రవచనాలలో భాగంగా బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ గారిచే రుక్మిణీ కళ్యాణము పై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యల్లాప్రగడ మల్లికార్జునరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కైలాసనాథ్ ప్రవచిస్తూ నేటి యువతరం ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమును శ్రద్ధగా చదివినా, విన్నా, పారాయణము చేసిన వారికి వివాహము జరగటమే కాక, చక్కటి వైవాహిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందన్నారు. ఈ విషయము ఆడపిల్లలకు మాత్రమే కాక మగపిల్లలకు కూడా వర్తిస్తుందన్నారు. భగవంతుని చేరకుండా అహంకార, మమకారములు అడ్డుపడుతాయన్నారు. అటువంటి పరిస్ధితులలో గురువుని ఆశ్రయించవలెనన్నారు. ఆ గురువు మనలను భగవంతుని వద్దకు చేర్చుతాడనీ అందలి విశేషాలను సవివరంగా తెలియజేశారు.
  ‘గుంటూరుతిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై 20.10.2024 ఆదివారం రాత్రి డాక్టర్ ఉమ్మనేని రంగారావు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య మాట్లాడుతూ చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో సుదీర్ఘ కాలం ప్రిన్సిపల్ , డైరెక్టర్ డాక్టర్ రంగారావు చేసిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ఆయన నాటికలు , కళలు , సంస్కృతి , తెలుగుదనం అంటే ఎంతో ఇష్టపడేవారన్నారు. ప్రముఖ రంగస్థల చలన చిత్రనటుడు మల్లాది భాస్కర్ మాట్లాడుతూ రంగారావు జ్ఞాపకంగా ఆయన కుటుంబ సభ్యులు గుంటూరు హ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో 115 వ హాస్య వల్లరి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు గుంటూరు హ్యూమర్ క్లబ్ అధ్యక్షుడు జంపని కిషోర్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లాది క్రియేషన్స్ , హైదరాబాద్ వారి చీకట్లో చంద్రుడు నాటిక ప్రదర్శించారు. కార్యక్రమంలో గుంటూరు హ్యూమర్ క్లబ్ కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతి , వ్యవస్థాపక కార్యదర్శి లాల్ వజీర్ , రంగారావు కుటుంబ సభ్యులు ఉమ్మనేని శివనాగేశ్వరరావు , ఉమ్మనేని వీరయ్య చౌద...
 శ్రీమద్భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనం ‘గుంటూరుతిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో శ్రీమద్భగవద్గీతలోని దశమ అధ్యాయంపై 18.10.2024 శుక్రవారం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అర్జునా సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనేననీ, నేను లేని చరాచరప్రాణి యేది లేదన్నారు. నా దివ్య విభూతులనై ఐశ్వర్య, కాంతి, శక్తి యుక్తములైన వస్తువు ఏదైనా నా తేజస్సు యొక్క అంశము నుండే కలిగినదన్నారు. ఈ సంపుర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క అంశతోనే దర్శించుచున్నానన్నారు.
 భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనాలు ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవత్ గీతలోని దశమ అధ్యాయంపై బుధవారం చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ...
శ్రీమద్భగవద్గీత పై చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై 14.10.2024 సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవత్ గీతలోని దశమ అధ్యాయంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో నా లీలావతార విశేషాలను దేవతలు గానీ, మహర్షులు గానీ తెలుసుకోలేరన్నారు. ఎందుకంటే అన్ని విధములుగా ఆ దేవతలకు, మహర్షులకు మూల కారణమైన వాడిని నేనేనన్నారు. యథార్థముగా జన్మరహితునిగా, ఆదిరహితుడై అన్నింటికి కారణమైనవానిని, సకల లోక మహేశ్వరునిగా తెలుసుకొన్నవారు మానవులలో జ్ఞాని అని వారు సర్వపాపముల నుండి విముక్తుడగుతారన్నారు. 18.10.2024 వరకు ప్రవచనములు జరుగునని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలియజేశారు.
 శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంపై ప్రవచనం ‘గుంటూరుతిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 14.10.2024 ఆదివారం సాయంత్రం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తిచే శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శులు పుట్టగుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరి నారాయణమూర్తి ప్రవచిస్తూ ఆశ్వీయుజ మాసం పవిత్రమైనదన్నారు. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయన్నారు. యమధర్మరాజు బాధల నుండి తొలగడానికి, సుఖాల శుభములు కలుగుటకు ఈ శరన్నవరాత్ర మహోత్సవములు చేస్తారన్నారు. దీనిని దేవీ నరవరాత్రులు అంటారు. ఈ సమయంలో కూడా తిరుమలలో బ్రహ్మోత్సవములు జరుగుతాయన్నారు. అమ్మవారి అలంకారాలు, తిరుమలలో శ్రీవారి అలంకారములు చేసి వారిని సందర్శించి భక్తులు తరిస్తారన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని గూర్చి భగవత్ భక్తులకు సవివరంగా తెలియజేశారు.
  ‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులు  ముగింపు  శనివారం 12.10.2024  విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి భక్తి సంగీత విభావరి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పత్రి నిర్మల గారి ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కళాకారులను ఘనంగా సత్కరించారు. పద్మావతి కళ్యాణవేదికపై   సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.