భక్తిశ్రద్ధలతో మహా చండీయాగ పూర్ణాహుతి స్థానిక బృందా వన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, రాజధాని అమరావతి అభివృద్ధి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ గత 14 రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం సోమవారం మహా పూర్ణాహుతి జరిపారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్వవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష్మి మహాగణపతికి, నవగ్రహాలకు, రుద్రుడికి అభి షేకాలు, అర్చనలు చేశారు. కలశపూజ, లక్ష్మీగణపతి, రుద్ర, చండీహోమం, 108 రకాల హోమద్రవ్యాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పుట్ట గుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటి.. ఉత్తర ద్వార దర్శనం - పోటెత్తిన భక్తకోటి
ముక్కోటి ఏకాదశి పర్వదినం మంగళవారం నగరమంతటా వైభవంగా జరిగింది. వైష్ణవాలయాలన్నీ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తజనసందోహంతో కిటికిటలాడాయి. ఆలయాల నిర్వాహకులు సోమవారం రాత్రికే భక్తుల కోసం సౌకర్యాలను సిద్ధం చేసి ఉంచారు. ఆలయాల ఉత్తర ద్వారాల వద్ద ఉత్సవమూర్తులను అందంగా పూలమాలలతో అలంకరించి పీఠంపై స్వామి ఆశీనుడై ఉన్నట్టు ఆకర్షణీ యంగా అలంకరించారు. మరికొన్ని చోట్ల ఆలయ సంప్రదాయ రీతులు అనుసరించి స్వామి, దేవేరుల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దగ్గర వేంచేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.



.jpeg)




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి