తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పై ఆదివారం ఆధ్యాత్మిక ప్రవచనము జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావైలోని 13వ పాశురాన్ని ప్రవచనం చేస్తూ కొందరు గోపికలు రాముల వారిని కీర్తిస్తే మరికొందరు గోపికలు శ్రీకృష్ణుని గానం చేస్తారన్నారు. వారిలో ఒక పెద్ద ఈ ఇద్దరు ఒక్కరే అని, విభేదాలు వర్ణని సహేతుకంగా చెప్తుందన్నారు. ఈ పాశురంలో ప్రధానంగా పెరియాళ్వారు. వారిని స్మరించాలి. భక్తులకు తెలియజేశారు. పాడుతా తీయగా విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లి తమ గాత్రధారణలో పలు అన్నమాచార్య కీర్తనలు, భక్తి గీతాలను మనోహరంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకుంది. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై బాలాజీ వాయిద్య సహకారం అందజేశారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాలను దేవస్థానం అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య ప్రారంభించారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి