పిరదౌసి కావ్యం అజరామరం
సాధారణంగా కావ్య పరిచయం మాటల రూపంలో ఉంటుంది. అయితే జాషువా రచించిన పిరదౌసి కావ్యంలోని పద్యాలను పలువురు మధుర కంఠస్వ రంతో పద్యగానం చేశారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం సోమవారం సాహితీప్రియులను పరవశులను చేసింది. మెట్టు శేషమ్మ, మెట్టు చిన్న మల్లారెడ్డి బీఈడీ కళాశాల, విశ్వనాథ సాహిత్య అకాడమీ, ఈశ్వర వరప్రసాద పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో పిరదౌసి కావ్యగానం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ రంగస్థల రచయిత, దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఆధునిక మహా కావ్యాల్లో మహాకవి జాషువా రచించిన పిరదౌసి కావ్యం అజరామరమైందన్నారు. సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ పిరదౌసి కావ్య నేపథ్యాన్ని, జాషువా జీవిత విశేషాలు, ఆయన సాహిత్య రంగా నికి చేసిన కృషిని వివరించారు. వి.ప్రేమ్కుమార్, ఎం.బ్రహ్మయ్య, పీవీ రమణ, జె.బాబూరావు, లెనినా, కిన్నెర్.. పిరదౌసి కావ్యంలోని పద్యాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి