ఘనంగా మహతీస్వర సుధ రజతోత్సవాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కల్యాణ వేదికపై ఆదివారం మహతీస్వర సుధ సంస్థ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలు జరిగాయి. గాయనీ గాయకులు పత్రి నిర్మల, సురభి శ్రావణి, రాజ్యలక్ష్మి, సాహిత్య, జరీనా, హేమమాలిని, ప్రద్యుమ్న, హరికృష్ణ, రసూల్బాబు, కమల్ కిషోర్, వీరయ్య, డాక్టర్ వీర రాఘవ, డాక్టర్ మురళీబాబూరావు, షేక్ వలి, కృష్ణప్రసాద్లు పాత తెలుగు చల నచిత్రా గీతాలను ఆలపించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాతలు, కళాకారులు, ఆలయ పాలక మండలి సహాయ, సహకారాలతో 300 కార్యక్ర మాలు సంస్థ నిర్వహించినట్లు చెప్పారు. గాయకులను సత్కరించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు మదన్మోహన్, పత్రి నిర్మల దంపతులను పలువురు సత్కరించారు. కీబోర్డుపై కె.రవిబాబు, తబలాపై ఎస్.వెంకట్, ప్యాడ్స్పై కె.చంద్ర, టి.ఈశ్వర్ వాద్య సహకారం అందించారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి