భక్తిశ్రద్ధలతో మహా చండీయాగ పూర్ణాహుతి స్థానిక బృందా వన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, రాజధాని అమరావతి అభివృద్ధి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ గత 14 రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం సోమవారం మహా పూర్ణాహుతి జరిపారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్వవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష్మి మహాగణపతికి, నవగ్రహాలకు, రుద్రుడికి అభి షేకాలు, అర్చనలు చేశారు. కలశపూజ, లక్ష్మీగణపతి, రుద్ర, చండీహోమం, 108 రకాల హోమద్రవ్యాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పుట్ట గుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
అన్నప్రసాద వితరణ, హోమాలు
బృందావన్ గార్డెన్స్ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలి తాంబ దంపతులు, దేవాలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో 14వ అన్నవితరణ కార్యక్రమం జరుగుతోంది. శనివారం దత్త జయంతి సందర్భంగా 14 మంది రుత్వికులతో దత్త హోమం, పూర్ణాహుతి నిర్వహిం చారు. అనంతరం అయ్యప్ప తదితర దీక్షాధారులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, లంకా విజయబాబు, పుట్టా ప్రభాకర్, వూటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి