ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...

బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్ - 30.07.2026

బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్

దివంగత కుమార్తె సాహితీ రెడ్డి గత 8 సంవత్సరాలుగా విద్య సామాజిక సేవలకు భూరి విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉన్న బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ రెడ్డి సుధావాణి దంపతుల సామాజిక సేవలు సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని విబిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పేర్కొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్మావతి కళ్యాణ మండపంపై బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధానోత్సవ సభ నిర్వహించారు. సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏకైక కుమార్తె జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఇతర సామాజిక కార్యక్రమాలకు రూ.8 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలకు అందించటం మిత్రుడిగా గర్విస్తున్నానన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం సాహితీ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితి సుగంధం ఆవిష్కరణ ఆవిష్కరించారు. బండి సాహితీ రెడ్డి వరిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ, రంగస్థల నటులు తనికెళ్ళ భరణికి, యువ ప్రతిభా పురస్కారాన్ని కాకతీయ చరిత్ర పరిశోధకుడు అరవింద ఆర్య పకిడే కు అందజేశారు. 50 మంది విద్యార్థులకు 10 వేల రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు పారితోషకం అందజేశారు. సభకు డాక్టర్ మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించగా జ్యోతి ప్రజ్వలన దేవాలయం అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య గావించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు, దేవాలయం కార్యదర్శి బొమ్ము ఉమామహేశ్వరరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణ్ రెడ్డి, గాయత్రి సన్మండలి శేషురాణి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.