బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం : వాసిరెడ్డి విద్యాసాగర్
దివంగత కుమార్తె సాహితీ రెడ్డి గత 8 సంవత్సరాలుగా విద్య సామాజిక సేవలకు భూరి విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉన్న బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ రెడ్డి సుధావాణి దంపతుల సామాజిక సేవలు సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని విబిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పేర్కొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్మావతి కళ్యాణ మండపంపై బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధానోత్సవ సభ నిర్వహించారు. సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏకైక కుమార్తె జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఇతర సామాజిక కార్యక్రమాలకు రూ.8 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలకు అందించటం మిత్రుడిగా గర్విస్తున్నానన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం సాహితీ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితి సుగంధం ఆవిష్కరణ ఆవిష్కరించారు. బండి సాహితీ రెడ్డి వరిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ, రంగస్థల నటులు తనికెళ్ళ భరణికి, యువ ప్రతిభా పురస్కారాన్ని కాకతీయ చరిత్ర పరిశోధకుడు అరవింద ఆర్య పకిడే కు అందజేశారు. 50 మంది విద్యార్థులకు 10 వేల రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు పారితోషకం అందజేశారు. సభకు డాక్టర్ మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించగా జ్యోతి ప్రజ్వలన దేవాలయం అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య గావించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు, దేవాలయం కార్యదర్శి బొమ్ము ఉమామహేశ్వరరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణ్ రెడ్డి, గాయత్రి సన్మండలి శేషురాణి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి