నాటకరంగానికి కావూరి సేవలు ప్రశంసనీయం
నాటక, సాహిత్య రంగానికి కావూరి సత్యనారాయణ చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మావతి కల్యాణ మండపంపై ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో మంగళ వారం ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ రచించిన 15 నాటికల సంపుటి ఆవిష్కరణ సభ జరి గింది. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నాటక, రచన రంగంలో దాదాపు 400కు పైగా పురస్కారాలు అందుకున్న కావూరి సత్యనారాయణ తనకు మిత్రుడవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగా న్ని, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. గతంలో వారికి రావాల్సిన ప్రోత్సహాకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. కావూరి సత్యనారాయణ స్పూర్తితో మ రింత మంది యువ రచయితలు ముందుకు రావాలని ఆకాంక్షిం చారు. అనంతరం కావూరి సత్యనారాయణను అతిథులు ఘనంగా స త్కరించారు. సభలో పాల్గొన్న అజో విభో కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణను సంస్కృతి బాల అవార్డుతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేశ్ బాబు, సినీనటుడు నాయుడు గోపి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి