కనుల పండువగా జగన్నాథ రథయాత్ర స్థానిక హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో శనివారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. హరే కృష్ణ.. జై కృష్ణ నామస్మరణతో భక్తులు పులకరించి పోయారు. యాత్రలో భక్తులు నామ సంకీర్తన, కోలాట ప్రదర్శనలు చేశారు. ఈ యాత్ర నవభారత్ నగర్, సూర్యదేవర కల్యాణ మండపం నుంచి ప్రారంభమై కొరిటెపాడు, లక్ష్మీపురం మీదగా సాగి బృందావన్ గార్డెన్స్, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముగిసింది అనంతరం స్వామి వారికి మంగళహారతి, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామిదేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్దలతో జరిగింది. శ్రీప్రసన్నాంజనేయస్వామి వారి భక్త సమాజం ఆధ్వర్యంలో పద్మావతి కల్యాణ వేదికపై శ్రీ వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. 108 పద్యా యాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి