అలరించిన కర్ణాటక సంగీత కచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం నిర్వహించిన కర్ణాటక సంగీత కచేరి ప్రేక్షకులను అలరింపజేసింది. హైదరాబాద్ కు చెందిన శ్రీ శేషసాయి సంగీత అకాడమి ఆధ్వర్యంలో త్యాగరాజ కృతి మణిమాల పేరుతో ఈ కార్య క్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీత విద్వాంసురాలు డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ శిష్యబృందం త్యాగరాజ స్వామి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై ఆనంద్, వీణపై యిమ్మడి అంజనీదేవి వాయిద్య సహకారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని యిమ్మడి అంజనీదేవి, మల్లికార్జునరావు పర్యవేక్షించారు




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి