ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించాలి - 04.07.2026

శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించాలి భారతీయ వారసత్వ శాస్త్రీయ సంగీత జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. గుంటూరు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో మంగ కంపల్లి జయంతి ఉత్సవ సభ శనివారం రాత్రి బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై జరిగింది. సభలో జస్టిస్ బి. కృష్ణమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి మహోన్నత సంగీత గురువులు దేశ సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేశారన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. గుంటూరులో బాలమురళీకృష్ణ పేరున ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలను కళాశాల స్థాయికి పెంచడం అవసరమన్నారు. సభకు పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుభట్ల కృష్ణవేణి అధ్యక్షత వహిం చారు. సభలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి లూరి సాత్వికమోహన్ కర్ణాటక గాత్ర సంగీత కచేరి చేశారు. సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, డాక్టర్ భూసురపల్లి వెంకటే శ్వర్లు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య తదితరులు ప్రసంగించారు...

శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించాలి - 04.07.2026

శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించాలి

భారతీయ వారసత్వ శాస్త్రీయ సంగీత జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. గుంటూరు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో మంగ కంపల్లి జయంతి ఉత్సవ సభ శనివారం రాత్రి బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై జరిగింది. సభలో జస్టిస్ బి. కృష్ణమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి మహోన్నత సంగీత గురువులు దేశ సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేశారన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. గుంటూరులో బాలమురళీకృష్ణ పేరున ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలను కళాశాల స్థాయికి పెంచడం అవసరమన్నారు. సభకు పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుభట్ల కృష్ణవేణి అధ్యక్షత వహిం చారు. సభలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి లూరి సాత్వికమోహన్ కర్ణాటక గాత్ర సంగీత కచేరి చేశారు. సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, డాక్టర్ భూసురపల్లి వెంకటే శ్వర్లు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య తదితరులు ప్రసంగించారు. తొలుత పోడూరి భార్గవి, పోడూరి ఐశ్వర్య గాత్ర కచేరి చేశారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు ఉప్పులూరి సాత్వికమోహన్ కర్ణాటక గాత్ర సంగీత కచేరి చేశారు.











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.