ముగిసిన నాటకోత్సవాలు
మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి 19వ వార్షికోత్సవాలు, వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 9వ వార్షికోత్సవాల సందర్భంగా మూడురో జుల పాటు కార్యక్రమాలు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య అన్నమయ్య కళావేదికపై కళావే జరిగాయి. చివరి రోజు సోమవారం రాత్రి జరిగిన సభ యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, ఆడిటర్ యర్రా ఈశ్వరరావు, రంగస్థల నటుడు నడింపల్లి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆర్యచాణక్య నాటకాన్ని మహతి క్రియేషన్స్, కళావిపంచి, హైదరా బాద్ కళాకారులు ప్రదర్శించారు. కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, బొప్పన నరసింహారావు, భాగిశాస్త్రి, సయ్యద్ జానీబాషా, డి. తిరుమలేశ్వరరావు, జి. మల్లికార్జునరావు.. కళాకారులు, అతిథులను సత్కరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి