కళారంగానికి అందిస్తున్న సేవలు అభినందనీయం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంక టేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై నిర్వహిస్తున్న డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వి తీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళాసమితి, వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ వార్షికోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భం గా రంగస్థల పురస్కార సభ నిర్వహించారు. ఏపీ టీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, టీవీ, చిత్ర నటుడు యు.సుబ్బరాయశర్మ, యడ్లపాడు వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్బాబు, ఆలయ పాలక మండలి సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు ప్రసంగిం చారు. కళారంగానికి చేస్తున్న సేవలను వక్తలు అభినందించారు. అనంతరం గురజాడ పుర స్కారం చెరుకూరి సాంబశివరావుకు, బళ్లారి రాఘవ పురస్కారం పోలవరపు భుజంగరావు, సీఎస్ఆర్ పురస్కారం నడింపల్లి వెంకటేశ్వర రావు, గరికపాటి రాజారావు పురస్కారం కేవీ సుబ్బారాయుడు, పి.గోవిందరావు పురస్కారం లావు అనీల్ చౌదరి, రఘురామయ్య పురస్కారం నరాలశెట్టి రవికుమార్, వైకే నాగేశ్వరరావు పుర స్కారం సంజయ్ కిశోర్, జామున రాయులు పురస్కారం సురభి లలిత, జంధ్యాల పుర స్కారం మద్దకూరి రవీంద్రకు ప్రదానం చేసి సత్కరించారు. సభలో కళావిపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, యువ కళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ, భాగిశాస్త్రి, సయ్యద్ జానీ బాషా, డి. తిరుమలేశ్వరరావు, జి. మల్లికార్జు నరావు పాల్గొన్నారు. సభానంతరం మల్లేశ్వరి ఆర్ట్స్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో దివంగత పి.భవానీప్రసాద్ రచించిన, పొలిమెట్ల సుబ్బారావు దర్శకత్వం వహించిన నువ్వో సగం- నేనో సగం నాటిక ప్రదర్శించారు. చక్కని ఇతివృత్తంతో స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలనే ఆశయం అనే అం శంపై ప్రదర్శితమైన నాటిక అలరించింది.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి