ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన ఉత్తర గోగ్రహణం తోలుబొమ్మలాట - 14.05.2026

అలరించిన ఉత్తర గోగ్రహణం తోలుబొమ్మలాట స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై గురువారం రాత్రి ఉత్తర గోగ్రహణం తోలు బొమ్మలాట ప్రదర్శించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో శ్రీషిర్డీసాయి తోలుబొమ్మలాట బృందం (నరసరావుపేట) కళాకారులు నిర్వహించగా, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. దుర్గారావు, కుమారి, వెంకటదాసు, నాగేశ్వరరావు, చిన్న, కోటేశ్వరి, సీతమ్మ, హనుమంతరావు, శివరా మకష్ణ, కమల్ బృందం మహాభారతంలోని పాండ వుల అజ్ఞాతవాసం, బృహన్నల నాట్య గురుత్వం, కౌరవుల కుట్ర, ఉత్తర కుమారుని ప్రజ్ఞలు, ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం తదితర ఘట్టాలను పద్యాలు, గేయాలు, వచనంతో ప్రదర్శించారు. ప్రేక్షకులను అలరించాయి. అనంతరం కళాకారులను గుళ్లపల్లి రాఘవేంద్రరావు సత్కరించారు.

అలరించిన నృత్య ప్రదర్శనలు - 28.04.2026

అలరించిన నృత్య ప్రదర్శనలు

స్థానిక బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం కార్యక్రమాలను ప్రముఖ హరికథకులు తుర్లపాటి శంభయాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ భూసురపల్లి వెం కటేశ్వరరావు అధ్యక్షత వహించగా, గుళ్లపల్లి సుబ్బారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఒడిశాకు చెందిన సునీల్ బెహర ప్రదర్శించిన ఒడిస్సా నాట్యం, అసోంకు చెందిన దీప శిఖ భూయాన్ సత్రియ నృత్యం, కేరళకు చెందిన అనిల్ వెట్టిక్కట్టిరి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం సంస్థ కార్యదర్శి డాక్టర్ ఖాజ వేంకట సుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న, అనిల్ వెట్టిక్కట్టిరికి సాత్రజతి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.