నాటకాల ప్రాముఖ్యాన్ని చాటాలి
నాటకాల ప్రాముఖ్యాన్ని నేటి తరానికి తెలి యజేసేలా ప్రభుత్వాలు, కళా సంస్థలు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మాగంటి మురళీమోహన్ అన్నారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వర దేవాలయంలో శనివారం గుమ్మడి శ్రీమన్నారాయణ కళాసమితి, వైకే నాగేశ్వరరావు కళా పరిషత్, డాక్టర్ మాగంటి మురళీ మోహన్ ద్వితీయ నాటకోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నాటక రంగంలో మంచి కళాకారులు ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. నాయుడి గోపి, కందిమళ్ల సాంబశివరావు ఇతర ప్రముఖుల కృషితో నాటక రంగం బతికే ఉందన్నారు. ఏపిలో కూడా సృజన్మాత్మక సంస్కృతి సమితి ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. అనంతరం నాటకోత్సవ కమిటి చైర్మన్ ఘంటా పున్నారావు, లాం, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఎన్టీఆర్ శతజయంతి కన్వీనర్ అట్లూరి నారాయణరావు, నాటక ప్రయోక్త, కందిమళ్ల సాంబశివరావు, అతిథులు కలిసి ఏపీ సృజనాత్మక సంస్కృతి చైర్మన్ పి.తేజస్వినీకి డాక్టర్ మాగంటి మురళీ మోహన్ రంగస్థల పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మురళీ మోహన్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సభానంతరం మద్దుకూరి ప్రొడెక్షన్స్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో మద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వం వహించిన మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శన సందేశాత్మకంగా సాగింది. ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాదు, కళా విపంచి యువకళావాహిని అధ్యక్షుడు బొప్పననరసింహారావు, లంకా లక్ష్మీనారాయణ, భాగిశాస్త్రీ సయ్యద్ జూనీ బాషా, డి.తిరుమలేశ్వరరావు, జీవీ మల్లికార్జునరావు, ఉత్తర అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి