విరాటపర్వంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం మహాభారతం విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారతంలోని విరాటపర్వం పాండవుల పదమూడో ఏట సాగిన అజ్ఞాతవాస వృత్తాంతాన్ని తెలియజేస్తుందన్నారు. పన్నెండేళ్ల అరణ్యవాసం ముగిసిన తర్వాత, పాండవులు ద్రౌపదితో కలిసి తమ గుర్తింపును దాచుకుని మారుపేర్లతో విరాటరాజు కొలువులో చేరతారన్నారు. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వల్లభుడుగా, అర్జునుడు బృహన్నలగా, నకుల సహదేవులు అశ్వ-గోసంరక్షకులుగా, ద్రౌపది సైరంధ్రిగా స్థిరపడతారన్నారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి