శ్వాస సామర్ధ్యాన్ని తగ్గించనున్న ఊపిరితిత్తుల వ్యాధులు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఊపిరితి త్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. కిమ్స్ శిఖర హాస్పిటల్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా చేపట్టగా, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు అనూష మోదేపల్లి మాట్లాడుతూ ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస సామర్ధ్యన్ని తగ్గిస్తాయని అన్నారు. తద్వారా రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తాయని పేర్కొన్నారు. అందులో ఆస్తమా, న్యుమోనియా, క్షయ, ఫైబ్రోసిస్ ముఖ్యమైనవని చెప్పారు. పొగతాగడం, కాలుష్యం, ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణాలని తెలిపారు. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గులో రక్తం పడటం లేదా శ్లేష్మం రావడం ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా ఉన్నట్లెతే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ధూమపానం మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండటం, ప్రాణాయామం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చనని అన్నారు. అనంతరం వైద్యురాలు అనూషను సత్కరించారు. సదస్సులో ఎన్.తిరుపతయ్య, కోగంటి బసవనందికేశ్వరరావు, దశరథి రామయ్య, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి