ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో, అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న శ్రీసాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కార్యక్రమాల్ని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ కార్యదర్శి భూసురపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, వీవీఐటీ విశ్వవిద్యాలయ వీసీ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన సౌమ్య శర్మ భరతనాట్యాన్ని, కేరళకు చెందిన హిత శశిధరన్ మోహిని అట్ట ప్రదర్శన, హైదరాబాదుకు చెందిన రితిక కంబాల దిన్నె కూచిపూడి నాట్యాన్ని హృద్యంగా నటించి ప్రేక్షకులను అలరించారు. సంస్థ కార్యదర్శి కాజ వెంకట సుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను సంస్థ కోశాధికారి వెంకటగిరి నాగలక్ష్మి, బిక్కీ అలేకరావు పర్యవేక్షించారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి